రాఫెల్ ఇష్యూ: డిఫెన్స్ మినిస్ట్రీలోని ఇద్దరు ఫైనాన్స్ ఆఫీసర్స్ షిఫ్ట్
న్యూఢిల్లీ: రాఫెల్ వ్యవహారం ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. డిఫెన్స్ మినిస్ట్రీలోని ఫైనాన్స్ విభాగానికి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను బయటి విభాగానికి షిఫ్ట్ చేశారు. ప్రభుత్వం వారిని డిఫెన్స్ మినిస్ట్రీలోని ఫైనాన్స్ విభాగంలో అపాయింట్ చేసిన నెలలకే ఇప్పుడు ఇది జరిగింది.
ఫైనాన్షియల్ అడ్వయిజర్ (డిఫెన్స్ సర్వీసెస్-ఎఫ్ఏడీఎస్), ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ఆఫీసర్ను రీప్లేస్ చేస్తున్నారు. ఈ నిర్ణయం ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (ఐడీఏఎస్) కేడర్ను షాకింగ్కు గురి చేసింది.
ఈ ఏడాది ఆగస్టు నెలలో ఎఫ్ఏడీఎస్ బాధ్యతలను మధులికా సుకుల్ తీసుకున్నారు. మధులికను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కు సెక్రటరీగా షిఫ్ట్ చేశారు. ప్రశాంత్ను మరో అధికారిని నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్కు షిఫ్ట్ చేశారు. వీరిద్దరు కూడా ఐడీఏఎస్లో సీనియర్ అధికారులు. పలు మంత్రిత్వ శాఖల్లో వారు పని చేశారు.
ఇప్పుడు డిఫెన్స్ మినిస్ట్రీ ఫైనాన్స్ హెడ్గా గార్గి కౌల్ను నియమించారు. ఇతను 1984 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ఆఫీసర్.