తల్లి,చెల్లి వెంటరాగ ఆమేథిలో రాహుల్ గాంధి నామినేషన్
Recommended Video
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి తన మొదటి పార్లమెంట్ నియోజకవర్గం అమేధిలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సమయంలో తన తల్లి ,యూపిఏ చైర్ పర్సన్ అయిన సోనియా గాంధి, చెల్లెలు ప్రియాంక వాద్ర వెంటఉన్నారు.అంతకు ముందు మూడు కిలోమేటర్ల మేర ర్యాలి కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది.
కేరళ 10తరగతి విద్యార్థిని ఎందుకు గుర్రంపై పరీక్షకు వెళ్లింది ?
భారీ ర్యాలీ నడుమ రాహుల్ గాంధి అమేథిలో నామినేషన్
మూడు కిలోమిటర్ల భారీ ర్యాలీ మధ్య నాల్గవసారి ఉత్తర ప్రదేశ్ లోని అమేధి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి తన నామినేషన్ ను ధాఖలు చేశారు. కాగా నామినేషన్ సమయంలో రాహుల్ గాంధి వెంట ఆయన తల్లి యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధి సోదరి ప్రియాంక గాంధి వాద్ర,బావా రాబర్ట్ వాద్ర ఉన్నారు. నామినేషన్ ముందు పెద్దెఎత్తున్న ర్యాలి నిర్వహించారు. కాగా ర్యాలీ మున్షిగంజ్ -దర్పిపూర్ నుండి గౌరిగంజ్ వరకు మూడు కిలోమీటర్ల మేర కొనసాగిన కార్యకర్తల ర్యాలిని ఆయన ప్రారంభించారు. ర్యాలీలో రాహుల్ గాంధితో పాటు ప్రియాంక గాంధి, ఆమే భర్త రాబర్ట్ వాద్ర, ప్రియాంక కూతురు మరియా, కొడుకు రెహన్ సైతం పాల్గోన్నారు. కాగా ర్యాలి సమయంలోనే, రాహుల్ నామినేషన్ కు ముందు సోనియా గాంధి అమేథి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది.
గత ఎన్నికల్లో లక్ష మెజారీతో గెలిచిన రాహుల్
కాగా 2014 లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధి ప్రత్యర్థి బీజేపి అభ్యర్థి అయిన స్మృతి ఇరాని పై 1లక్ష 7వేల 903 ఓట్లతో గెలుపోందారు.రాహుల్ గాంధి 4,64,195 ఓట్లను పోందగా స్మృతి ఇరాని 3.07 లక్షల ఓట్లను పోందింది.కాగ అంతకు మందు 2009 ఎన్నికల్లో రాహుల్ 3.7 లక్షల ఓట్ల మెజారిటితో బీఎస్పి అభ్యర్థి అశీష్ శుక్లపై గెలుపోందారు.
వయానాడ్ లో మొదటి నామినేషన్
కాగా రాహుల్ గాంధి రెండు లోక్ సభ నియోజవర్గాల్లో పోటి చేస్తున్న సంగతి తెలిసిందే, తన రెండవ పార్లమెంట్ నియోజకవర్గమైన వయానాడ్ ఆయన గత గురువారం నామినేషన్ ధాఖలు చేశారు.వయానాడ్ లో ఎప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా ఆమేధిలో మే6న పోలింగ్ జరగనుంది.