చెల్లెలు ప్రియాంక తో కలిసి వయానాడ్ లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధి
భారీ ర్యాలీ మధ్య కేరళలోని వయానాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి తన నామినేషన్ ను ధాఖలు చేశారు.కాగా నామినేషన్ సమయంలో రాహుల్ గాంధి వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధి ఉన్నారు. అంతకు ముందు ఉదయం రాహుల్ గాంధి హెలికాప్టర్ ద్వార కేరళకు చేరుకున్నారు. నామినేషన్ సమయంలో పెద్దెఎత్తున్న కార్యకర్తల ర్యాలి కొనసాగింది. ర్యాలీలో బయలుదేరిన రాహుల్ గాంధితో పాటు ప్రియాంక గాంధికి కేరళ రాష్ట్ర్ర మాజి ముఖ్యమంత్రి,రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన ఉమెన్ చాందీతోపాటు అక్కడి కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు.
ఈనేపథ్యంలోనే రాహుల్ గాంధి అమేధితో పాటు కేరళ లోని హిల్ ఏరియా అయినా వయానాడ్ నుండి పోటి చేస్తారని గత వారమే ప్రకటించారు .కాగా ఆమేధి లో బీజేపీ అభ్యర్థిగా స్మృతి ఇరాని పోటి చేస్తుంది.దీంతో రాహుల్ దక్షిణాది రాష్ట్రాలను మోడీ పట్టించుకోకపోవడంతో అక్కడి ప్రజల మనోభావాలను ప్రతిభిబించేందుకు పోటి చేస్తున్నట్టు రాహుల్ ప్రకటించారు. కాగా వయానాడ్ లో ఏప్రిల్ 23 న పోలింగ్ జరగనుండగా, అమేథిలో మే 6 పోలింగ్ జరగనుంది.
Kerala: Congress President Rahul Gandhi holds a roadshow in Wayanad after filing nomination. Priyanka Gandhi Vadra and Ramesh Chennithala also present pic.twitter.com/kAW08X22u0
— ANI (@ANI) April 4, 2019