వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు సమస్యలను రాహుల్ మరచిపోయారు.. పినరయి విజయన్ విమర్శలు

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈట కొట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. రైతులు/ వారి సమస్యలు అంటే రాహుల్ గాంధీకి పట్టవని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. అందుకే స్వేచ్చగా స్విమ్మింగ్ చేశారని దుయ్యబట్టారు. అన్నదాతలను రాహుల్ మర్చిపోయారని విజయన్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తుంటే రాహుల్ ఏమాత్రం పట్టింపు లేకుండా మత్స్యకారులతో కలిసి సముద్రంలో ఈత కొడుతున్నారని ఎద్దవా చేశారు.

విజయన్ గురువారం తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై.. రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ కేరళకు పర్యాటకం కోసం వచ్చినట్టు ఉన్నారని విజయన్ ఫైరయ్యారు. మత్స్యకారులతో కలిసి ఆయన ట్రాక్టర్ తోలుతున్నారని గుర్తుచేశారు. సముద్రంలో ఈత కొడుతున్నారని చెప్పారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో అనే విషయమే మర్చిపోయారని విరుచుకుపడ్డారు.

Rahul gandhi ignored farmers protest: vijayan

రైతుల గురించి ఒక్క మాటైనా రాహుల్ గాంధీ మాట్లాడటం లేదన్నారు. వారిని పూర్తిగా విస్మరించారని ఫైరయ్యారు. కేరళ రైతులకు మద్దతుగా ఉండాల్సింది పోయి ఇలా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని రాహుల్‌పై ఒంటికాలిపై లేచారు.

English summary
congress leader Rahul gandhi ignored farmers protest kerala cm pinarayi vijayan said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X