రేప్లకు రాజధానిగా భారతదేశం... రాహుల్ గాంధీ సెన్సెషల్ కామెంట్స్
దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై ఎంపీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం అత్యాచారాలకు రాజధానిగా మారుతోందని తీవ్రంగా విమర్శించారు. దేశంలో జరగుతున్న రేప్ ఘటనలపై ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని ఆయన అన్నారు. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఓ చోట హత్యాచారాలు జరుగుతున్నాయని ఈ సంధర్భంగా గుర్తు చేశారు..
ఈ నేపథ్యంలోనే యూపిలో ఓ ఎమ్మెల్యే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నా... ప్రధాన మంత్రి మౌనంగా ఎందుకు ఉంటున్నారని అన్నారు. దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై ప్రధాన మంత్రి కనీసం ఒక్క మాట కూడ మాట్లాడడం లేదని ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే నేరుగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కోంటున్నా... ప్రధాని మాట్లాడడం లేదని ఆయన దుయ్యబట్టారు.
దిశ సంఘటనతో ఒక్కసారిగా దేశంలో మహిళలపై జరుగుతున్న హత్యలు,అత్యాచారాలపై దేశం మొత్తం గళం విప్పుతోంది. దిశ హత్య జరిగి దేశం మొత్తం ఆందోళనలు జరుగుతున్న సంధర్భంలోనే అంతకుముందు సంచలనం సృష్టించిన ఉన్నావో బాధితురాలిపై కిరోసిన్ పోసి హత్య చేసిన సంఘటన కూడ దేశాన్ని అట్టుడికేలా చేస్తోంది. దీంతో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఉన్నావో సంఘటనపై గళం ఎత్తారు. యూపీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండగా అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కేసులో నిందితుడిగా ఉండడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రం అయ్యాయి.