వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్వార్ గ్యాంగ్‌రేప్ మహిళకు న్యాయం జరుగుతుంది.. రాహుల్ గాంధి

|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన రాజస్థాన్‌లోని ఆల్వార్ అత్యాచారానికి గురైన భాదిత మహిళను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. రాహుల్ గాంధి రాష్ట్ర్ర సీఎం అశోక్ గెహ్లాట్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా బాధితురాలికి తగిన న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.

Rahul Gandhi meets the Alwar gang-rape survivor

కాగా జరిగిన సంఘటన పై ప్రధాని మోడీ చేసిన విమర్శలపై రాహుల్ మాట్లాడేందుకు నిరాకరించారు. తాను రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదని బాధితురాలికి న్యాయం చేకూర్చేందుకు వచ్చానని చెప్పారు. ఈనేపథ్యంలోనే భాదితురాలితో పాటు ఆమే కుటుంభానికి సరైన న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు.

గత నెల 26న టూవీలర్ పై వెళుతున్న భార్యభర్తలను అడ్డగించి ఆరుగురు వ్యక్తులు స్థానికంగా ఉన్న ఇసుక క్వారీల్లోకి తీసుకెళ్లి, భర్తముందే 18 సంవత్సరాల మహిళపై అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది..ఈనేపథ్యంలోనే అత్యాచారం ఘటనపై దేశ ప్రధాని నరేంద్రమోడీ నేరుగా ప్రస్థావించారు. రాజస్థాన్ ప్రభుత్వానికి మద్దతుపలుకుతున్న మాయవతిపై ఆయన విరుకుచుకు పడ్డారు.

మాయవతి దళితుల హక్కులను కాపాడడంలో ముసలి కన్నీరు కారుస్తుందని యూపి ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతల మధ్య మాటల యుద్దం కొనసాగింది. కాగా రాజస్థాన్ లో ఆశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు మాయవతికి చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు ప్రధాని నరేంద్రమోడీ.

English summary
Rahul Gandhi today met the Alwar gang-rape survivor and said justice would be done and that both her family and she would receive "nyay". The Congress government in the state had earlier been criticised by Prime Minister Narendra Modi and Bahujan Samaj Party chief Mayawati
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X