గుజరాత్లో రాహుల్ గాంధీపై రాళ్ల దాడి, పగిలిన కారు అద్దాలు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కాన్వాయ్ పైన గుజరాత్లో దాడి జరిగింది. ఆయన వరద బాధిత ప్రాంతాల్లో పరామర్శ కోసం వెళ్లారు.
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కాన్వాయ్ పైన గుజరాత్లో దాడి జరిగింది. ఆయన వరద బాధిత ప్రాంతాల్లో పరామర్శ కోసం వెళ్లారు.
అప్పుడు పలువురు ఆయన కాన్వాయ్ పైన రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటన శుక్రవారం నాడు బనస్కంత జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దాడిలో కారు దెబ్బతిన్నది. అద్దం పగిలింది.
కానీ రాహుల్ గాంధీకి ఏమీ కాలేదు. ఆ సమయంలో రాహుల్ ముందు సీట్లో కూర్చున్నాడు. రాహుల్ ఎస్పీజీ కమాండోస్ రక్షణలో వెళ్తున్నాడు. ఎస్పీజీ కమాండోలు స్వల్పంగా గాయపడ్డారని తెలుస్తోంది.
బిజెపి గూండాలు రాహుల్ గాంధీ కారుపై లాల్ చౌక్ వద్ద రాళ్లతో దాడి చేశారని, కారు విండో అద్దాలు పగిలిపోయాయని, సెక్యూరిటీ స్టాఫ్ గాయపడిందని, నిజాన్ని దాచలేమని బిజెపి గుర్తించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా చెప్పారు.
మరోవైపు, ఈ ఘటనతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదని బిజెపి నేత జగదాంబికా పాల్ అన్నారు. ఈ వార్తలు అవాస్తవం అని, దురదృష్టవశాత్తు జరిగిన ఘటన అన్నారు. దీని వెనుక బిజెపి ఉందని తాము భావించడం లేదన్నారు.