రాహుల్ విమానంలో సాంకేతిక లోపం: అత్యవసర ల్యాండింగ్, మోడీ ఫోన్
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి కర్ణాటకలోని హుబ్లీకి గురువారం ఆయన ప్రయాణించిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే ల్యాండింగ్ కూడా సవ్యంగా కాలేదు.
ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈ ఘటన జరిగిందా? అనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు విమాన పైలట్లను విచారించారు. ఈ సందర్భంగా కర్ణాటక పోలీస్ చీఫ్ నీల్ మణి ఎ. రాజు మాట్లాడుతూ.. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పారు.
ఈ ఫిర్యాదు విషయమై పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ కు పోలీసులు తెలియజేయనున్నట్టు తెలుస్తోంది. రాహుల్ సహాయకుడు కౌశల్ విద్యార్థి విమాన ఘటనపై డీజీసీఏకు ఓ లేఖ రాశారు. దీంతో డీజీసీఏ వివరణ ఇచ్చింది.
Kaushal Vidyarthee, travelling in Special Flight New Delhi-Hubli, with 4 others including Rahul Gandhi, writes to DG&IG K'taka stating 'unexplained technical failures' occurred during course of flight; also adds 'shuddering & altitude dipping were not natural or weather related'. pic.twitter.com/XeVLN0syXi
— ANI (@ANI) April 26, 2018
Recommended Video
ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని, పైలట్ చాకచక్యంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారని తెలిపింది. కాగా, ఈ ఘటన నేపథ్యంలో రాహుల్కు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మధ్యాహ్నం ఫోన్ చేసి ఆయన క్షేమ సమాచారాల గురించి ఆరా తీశారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
'రాహుల్కు మోడీ ఫోన్ చేసి ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదు.. అయినా ప్రస్తుతం రాహుల్ ఆరోగ్య పరిస్థతి గురించి మోడీ ఆరా తీశారు. ఈ ఘటనను ప్రభుత్వం తేలికగా తీసుకోవడం లేదని మోడీ చెప్పారు' అని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.