దళిత యువతితో రాహుల్ గాంధీ పెళ్లి జరిపించండి, మా తోనే సవాల్ చేస్తారా, మాజీ మంత్రి !
బీజేపీ నాయకులు దళితుల ఇంటిలో భోజనం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎద్దేవ చెయ్యడం విడ్డూరంగా ఉందని ఆ రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ బోమ్మాయ్.
బెంగళూరు: బీజేపీ నాయకులు దళితుల ఇంటిలో భోజనం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎద్దేవ చెయ్యడం విడ్డూరంగా ఉందని ఆ రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ బోమ్మాయ్ హావేరి జిల్లా శిగ్గావిలో మండిపడ్డారు.
శశికళ జైల్లో కొంచం కూడా తగ్గలేదు, అంబులెన్స్ లో ఆహారం, సహాయం చేస్తున్న అధికారి!
దళితులను అడ్డం పెట్టుకుని మేము రాజకీయాలు చెయ్యనవసరం లేదని బసవరాజ్ బోమ్మాయ్ అన్నారు. దళితుల మీద అంత ప్రేమ ఉంటే అదే కులానికి చెందిన యువతిని మీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి ఇచ్చి పెళ్లి చెయ్యాలని సవాలు విసిరారు.
దేశంలో కేవలం దళితులను ఉద్దరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. మీకు దమ్ముంటే దళిత యువతిని రాహుల్ గాంధీకి ఇచ్చి వివాహం జరిపిస్తే కేవలం కర్ణాటకలోనే కాకుండా దేశంలోని దళితులు అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశం ఉందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. బీజేపీ ఏనాడు కులాల వారిగా ప్రజలను, కార్యకర్తలు చూడదని ఇదే సందర్బంలో బసవరాజ్ బోమ్మయ్ చెప్పారు.