వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రేషన్ కూడా ఇవ్వట్లేదు: కేంద్రమంత్రి హరిసిమ్రత్ బాదల్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి హరిసిమ్రత్ బాదల్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆమె సూచించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీపై మండిపడ్డారు. కేంద్రం పంపించిన రేషన్ సరుకులను కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పంపిణీ చేయలేదని గుర్తుచేశారు.

 Rahul Gandhi should question Congress governments:Harsimrat

పంజాబ్ రాష్ట్రంలో కేంద్రం పంపించిన రేషన్ సరుకులు గోదాముల్లో మగ్గుతున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంత జరుగుతుంటే.. రాహుల్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముందు అక్కడ చక్కదిద్దుకొని.. జాతీయ నేతగా వ్యవహరించాలని రాహుల్ గాంధీకి సూచించారు.

పంజాబ్‌లో మంత్రివర్గం గత మూడేళ్లులో భౌతికదూరం పాటిస్తోందని ఆరోపించారు. కరోనా వైరస్ సోకినట్టు.. మంత్రివర్గ సభ్యులు వ్యవహారిస్తున్నారని తెలిపారు. ఫాం హౌస్‌లో ఉంటూ.. ప్రజలకు దూరంగా ఉన్నారని తెలిపారు. పంజాబ్ రాష్ట్రానికి కేంద్రం 70 వేల మెట్రిక్ టన్నుల రేషన్ అందిస్తే... గత నెలన్నర నుంచి ఒక శాతం కూడా పంపిణీ చేయలేదని విమర్శించారు.

English summary
union Food Processing Minister Harsimrat Badal trained her guns on Congress leader Rahul Gandhi. he has been releasing videos every day questioning the Modi government during the Covid-19 lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X