నేడు వయనాడ్కు రాహుల్.. మూడు రోజులపాటు సాగనున్న పర్యటన..
ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటనలో భాగంగా కేరళ వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి ఆయన 4లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో తనకు భారీ విజయం కట్టబెట్టిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ వయనాడ్లో పర్యటించనున్నారు. జిల్లాలోని ముఖ్య ప్రాంతాల్లో ఆయన ఆరు రోడ్ షోలు నిర్వహించినున్నారు.
ఉదయం పదిన్నరకు కల్పెట్టాలో రాహుల్ గాంధీ రోడ్ షో ప్రారంభంకానుంది. ఉ. 11:45గంటలకు కంబల్కాడ్, 12:30కు పనమారం, 2గంటలకు మనంతవాడీ, 3గంటలకు పుల్పల్లి, 4:30గంటలకు సుల్తాన్ బథేరీ మీదుగా మీదుగా ఆయన ర్యాలీ సాగనుంది.
శని, ఆదివారాల్లో వయనాడ్లోని వివిధ పట్టణాల్లో రాహుల్ పర్యటన సాగనుంది. తిరువంబాడి అసెంబ్లీ సెగ్మెంట్లో ఆయన ప్రసంగించనున్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబాన్ని రాహుల్ పరామర్శించనున్నట్లు వయనాడ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించారు. పార్టీ వైఫల్యంతో నిరాశలో కూరుకుపోయిన రాహుల్ గాంధీకి ఈ పర్యటనతో కొత్త ఉత్తేజం వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ ఎల్డీఎఫ్ అభ్యర్థిపై 4,31,063 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.