రైలు ప్రమాదాలకు 25 వేల మంది బలి
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాలలో జరిగిన రైలు ప్రమాదాలలో 25 వేల మందికి పైగా మరణించారని వెలుగు చూసింది. గత సంవత్సరం భారత దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో జరిగిన రైలు ప్రమాదాలలో 25,006 మంది మరణించారని జాతీయ నేర గణాంక విభాగం (ఎన్ సీఆర్ బీ) వెల్లడించింది.
2014వ సంవత్సరంలో రైలు ప్రమాదాలలో 25 వేల మంది ప్రాణాలు పోయాయి. అదే విదంగా 3,882 మందికి తీవ్రగాయాలైనాయి. గతంతో పోల్చుకుంటే 2014వ సంవత్సరంలో ప్రమాదాల సంఖ్య 9.2 శాతం తగ్గిందని వెలుగు చూసింది.
2013వ సంవత్సరంలో జరిగిన రైలు ప్రమాదాలలో 31,236 మంది మరణించారని కేసులు నమోదు అయ్యాయి. 17,480 మంది రైళ్లు డీకొని, రైలు నుంచి జారిపడి మరణించారని కేసులు నమోదు అయ్యాయని ఎన్ సీఆర్ బీ రికార్డులు వెల్లడించాయి.
రైలు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. డ్రైవర్ల నిర్లక్ష కారణంగా జరిగిన 60 ప్రమాదాలలో 67 మంది మరణించారని వెలుగు చూసింది. సాంకేతిక లోపాల కారణంగా 469 ప్రమాదాలు జరిగాయని ఎన్ సీఆర్ బీ వెల్లడించింది.