మృతుల కుటుంబాలకు రూ.3.5 లక్షల ఎక్స్గ్రేషియా, యూపీ కూడా
యూపీలో ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు జరిగిన పట్నా - ఇండోర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది.
లక్నో: యూపీలో ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు జరిగిన పట్నా - ఇండోర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.3.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు.
1/Enhanced amount of ex-gratia compensation to the victims of this unfortunate accident:Rs.3.5 L in case of death
— Suresh Prabhu (@sureshpprabhu) November 20, 2016
కాగా, ప్రమాద స్థలంలో సహాయచర్యలు చేపట్టేందుకు వారణాసి, లక్నో నుంచి మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఒక్కో బృందంలో 45 మంది సిబ్బంది ఉన్నారు. దాదాపు 250 మంది పోలీసులు ప్రమాదస్థలి వద్ద రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ప్రమాదానికి గల కారణాలను రైల్వే భద్రతా కమిషనర్ విచారిస్తున్నారని కేంద్రమంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు.
2/Rs.50 thousand in case of grievous injury and Rs.25 thousand in case of simple injury
— Suresh Prabhu (@sureshpprabhu) November 20, 2016
3/This is in addition to the compensation which will be available through Railway Claims Tribunal
— Suresh Prabhu (@sureshpprabhu) November 20, 2016
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 91కు చేరినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 150 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది.
In constant touch with UP CM @yadavakhilesh.We are working together to provide all relief
— Suresh Prabhu (@sureshpprabhu) November 20, 2016