భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం: 12 నుంచే ప్రయాణికుల రైళ్లు ప్రారంభం
న్యూఢిల్లీ: భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మే 12 నుంచి పరిమిత సంఖ్యలో ప్రయాణికుల రైళ్లు నడపనున్నట్లు ఆదివారం రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి 15 రైళ్లు నడుపుతామని పేర్కొంది.
ఢిల్లీ నుంచి దిబ్రూఘర్, అగర్తాలా, హౌరా, పాట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబై, సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీలకు ఈ రైళ్లు వెళ్తాయని తెలిపింది.
ఈ రైళ్లకు మే 11 నుంచి రిజర్వేషన్లు ప్రారంభం కానుండగా, త్వరలో కోచ్లను బట్టి మిగితా రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 20వేల రైలు కోచ్లు కరోనావైరస్ బాధితుల కోసం కేటాయించారు. ప్రతిరోజూ వలస కూలీలను తరలించేందుకు 300 శ్రామిక్ రైళ్లు నడుపుతున్నారు.
Indian Railways plans to gradually restart passenger train operations from 12th May, 2020, initially with 15 pairs of trains
— Ministry of Railways (@RailMinIndia) May 10, 2020
These trains will be run as special trains from New Delhi Station connecting 15 important cities of the countryhttps://t.co/tOvEFT1C8Z pic.twitter.com/dvdxKaxshM
Recommended Video
కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా దేశంలో రైళ్లను నిలిపివేసిన విషయం తెలిసిందే. మే 17తో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక విమానాలు కూడా త్వరలోనే ఎగిరే అవకాశాలున్నాయి.