వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి 200 నాన్-ఏసీ రైళ్లు..

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ 4.0లో రైళ్లు,విమానాలు మినహాయించి దాదాపుగా అన్ని రంగాలకు కేంద్రం సడలింపులనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే రైలు సర్వీసులను కూడా తిరిగి అందుబాటులోకి తీసుకురానుంది. జూన్ 1వ తేదీ నుంచి ప్రతీరోజూ 200 నాన్-ఏసీ రైళ్లను నడపనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వీటికి సంబంధించిన బుకింగ్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Recommended Video

Railways To Start 200 Non-AC Special Passenger Trains From June 1st

రిజర్వేషన్ చేయించుకున్న వారిని మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తారని.. కౌంటర్ల వద్ద టికెట్ల జారీ,బుకింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే రిజర్వేషన్‌ ప్రక్రియ ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందనేది స్పష్టత ఇవ్వలేదు.మరోవైపు వలస కూలీల కోసం ప్రస్తుతం నడుపుతున్న 200 శ్రామిక్ రైళ్లను 2 రోజుల్లోగా రెట్టింపు చేస్తామని వెల్లడించారు. ప్రతీ రోజూ 400 శ్రామిక్ రైళ్లను నడుపుతామన్నారు. కాబట్టి వలస కూలీలు ఎక్కడివారే అక్కడే ఉండాలని.. రాబోయే కొద్దిరోజుల్లో రైల్వే వారందరినీ వారి గమ్య స్థానాలకు చేరుస్తుందని చెప్పారు.

Railways To Run 200 Non-AC passenger Trains Daily From June 1

కాగా, మే 22వ తేదీ నుంచి వెయిటింగ్ లిస్ట్‌ను ప్రారంభిస్తున్నట్టు రైల్వేశాఖ గత వారమే వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నడుపుతున్న 15 స్పెషల్ ట్రైన్స్‌తో పాటు మరిన్ని రైళ్లను నడుపుతామని చెప్పింది. దానికి తగ్గట్టే తాజాగా రైళ్ల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే రైల్వే నిర్ణయంపై రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
Passenger train service will expand from the existing 15 trains to more than 200 staring next month. The service will involve non-air conditioned trains, which had not been allowed so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X