భర్తను ఏడాదిగా బెడ్రూంలోనే!: షాకిచ్చిన మహిళ
రాయపూర్: తన భర్త ఏడాదికాలంగా కనిపించకుండా పోయాడని ఇన్నాళ్లు చెప్పిన ఓ మహిళ, ఇరుగుపొరుగు వారి దెబ్బకు హఠాత్తుగా అసలు విషయం చెప్పి అందరికీ షాకిచ్చింది. ఆమె పైన అనుమానం వచ్చి పోలీసులు అరెస్టు చేసి విచారించడంతో బండారం బట్టబయలు అయింది.
తన భర్తను తమ ఇంట్లోని బెడ్రూంలో సమాధి చేసినట్లు చెప్పింది. ఈ సంఘటన చత్తీస్గఢ్లోని రాయపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంట్లోని పడక గదిలో కింద పూడ్చిపెట్టిన 45 ఏళ్ల రాజ్వీందర్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.
అయితే, తన భర్తను తాను చంపలేదని, అకాల మృత్యువాతపడటంతో అంత్యక్రియలకు డబ్బులు లేక ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు భార్య మన్ ప్రీత్ చెప్పారు.
ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం తెలిసిందే. ఆమె ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు పోలీసులకు చెప్పారు. వారు తవ్వకాలు జరిపారు.
అతనికి సిక్కు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి, సమాధి నిర్మాణానికి తన వద్ద డబ్బులు లేకపోవడంతో బెడ్రూంలో సమాధి చేసినట్లు చెప్పింది. కేసును పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేసేందుకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.