రేప్ చేస్తే కాళ్లు, చేతులు నరకాలి: ‘షరియా’లాంటి చట్టాలంటూ థాక్రే
ముంబై: మహిళలు, బాలికలపై ఆకృత్యాలకు పాల్పడే వారిపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే ఘాటుగా స్పందించారు. దేశంలో మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారి కాళ్లు, చేతులు నరకాల్సిందేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేశంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇస్లామిక్(షరియా) కఠిన చట్టాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా కోపర్ది గ్రామంలో జులై 13వ తేదీన 15ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనపై రాజ్థాక్రే ఇలా స్పందించారు.
బాధిత బాలిక కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలంటే ప్రస్తుత చట్టాలను మార్చాల్సిన అవసరముందన్నారు.
సంఘవ్యతిరేక శక్తులను అదుపు చేసేందుకు షరియా లాంటి కఠిన చట్టాలు అమలు చేయాలని రాజ్థాక్రే డిమాండు చేశారు. తప్పు చేయాలంటే భయపడేలా చట్టాలు ఉండాలని అన్నారు. అంతేగాక, ఎస్సీ, ఎస్టీ చట్టాలను దుర్వినియోగం కాకుండా చూడాలని అన్నారు.
రాజ్ థాక్రే
మహిళలు, బాలికలపై ఆకృత్యాలకు పాల్పడే వారిపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే ఘాటుగా స్పందించారు. దేశంలో మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారి కాళ్లు, చేతులు నరకాల్సిందేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాజ్ థాక్రే
దేశంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇస్లామిక్(షరియా) కఠిన చట్టాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజ్ థాక్రే
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా కోపర్ది గ్రామంలో జులై 13వ తేదీన 15ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనపై రాజ్థాక్రే ఇలా స్పందించారు.
రాజ్ థాక్రే
బాధిత బాలిక కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలంటే ప్రస్తుత చట్టాలను మార్చాల్సిన అవసరముందన్నారు.