వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి వేడుకలో విషాదం: నదిలో పడ్డ బస్సు, 24 మంది మృతి

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడిపోవడంతో 24 మంది దుర్మరణం పాలయ్యారు. బూండీలోని కోట లాల్ సాత్ మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

పెళ్లి వేడుక నిమిత్తం వరుడి కుటుంబం, బంధువులు, స్నేహితులు కోట నుంచి సవాయ్ మాదోపూర్ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్ నదిలో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులు సుమారు 40 మంది ఉన్నట్లు సమాచారం.

Rajasthan: 24 dead as bus falls off bridge in Boondi

Recommended Video

APSRTC Launches Chalo APP | ఇక ఆర్టీసీ ప్రయాణం.. మరింత సుఖం! | Oneindia Telugu

ఇప్పటి వరకు కనీసం 24 మంది మృతి చెందినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ప్రయాణికులను బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

English summary
At least 24 have been reported dead as bus in Rajasthan's Boondi fell in a river. The bus was reportedly carrying over 40 members of the family and friends of a groom who was supposed to get married.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X