సచిన్ సిక్స్ కొడితే సీఎంకు బాల్ కనపడలేదు,సీఎంకు చిన్నప్పటి ఏనుగమ్మ ఏనుగు పాట గుర్తుకొస్తోంది,దేవుడా!
జైపూర్/ న్యూఢిల్లీ/ లక్నో: కరోనా (COVID 19) కాలంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ కు ఎవ్వరికీ రాని కష్టాలు ఎదురౌతున్నాయి. ఓ పక్క ఇంతకాలం పక్కలో ఉండి నేడు బళ్లెం అయిన సచిన్ పైలెట్ సిక్స్ కొట్టడంతో ఆ బాల్ కనపడకపోవడంతో సీఎం తల గిర్రున తిరిగిపోయింది. ఇదే సమయంలో స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు, బీఎస్ పీ ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం కుర్చి కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న సీఎంకు ఏనుగు ఎక్కడ బలంగా కొడుతుందో అనే భయంతో ఆయనకు చిన్నప్పటి పాట ఏనుగమ్మ ఏనుగు గుర్తుకు వస్తోంది. బీఎస్ పీకి చెందిన ఆరు మంది ఎమ్మెల్యేలు నేడు సీఎంకు దేవుళ్లతో సమానం అయ్యారు. అయితే ఆగస్టు 11వ తేదీ హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో ? అంటూ సీఎం అశోక్ గెహ్లెట్ చాలా టెన్షన్ టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.
I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!
ఇప్పటికే సచిన్ సిక్స్ కొట్టాడు
కేపీసీసీ అధ్యక్షుడితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి సీఎం అశోక్ గెహ్లెట్ కు సవాలు విసిరారు. అదే సమయంలో సచిన్ పైలెట్ కు మరో 18 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇవ్వడంతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్ తల గిర్రున తిరిగిపోయింది. ఒక్కసారిగా సచిన్ సిక్స్ కొట్టడంతో సీఎం అశోక్ గెహ్లెట్ కు బాల్ కనపడకుండా పోయింది.
సీఎంకు 6 ఏనుగుల బలం
సచిన్ పైలెట్ తో పాటు ఆయన వర్గం సీఎం అశోక్ గెహ్లెట్ కు సినిమా చూపిస్తున్న సమయంలోనే బీఎస్ పీకి చెందిన ఆరు మంది ఎమ్మెల్యేలు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్ కు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ఇదే సమయంలో బీఎస్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నామని రాజస్థాన్ కు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. అబ్బా ఆరు ఏనుగల బలం వచ్చిందని సీఎం అశోక్ గెహ్లెట్ కొంచెం ఊపిరిపీల్చుకున్నారు.
బీఎస్ పీ విలీనం వెనుక రామాయణం
బీఎస్ పీకి చెందిన ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనం కావడాన్ని బీఎస్ పీ పార్టీ టాప్ లీడర్లు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. బీఎస్ పీ ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ చీఫ్ మాయావతి ఇప్పటికే మండిపడిన విషయం తెలిసిందే. ఆరు మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనం కావడాన్ని వ్యతిరేకిస్తూ 2019 సెప్టెంబర్ నెలలోనే బీజేపీ, బీఎస్ పీ నాయకులు రాజస్థాన్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
హైకోర్టులో వివాదం
రాజస్థాన్ లోని ఆరు మంది బీఎస్ పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనం కావడానికి సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏకసభ్య బెంచ్ పిటిషన్ విచారణ చేస్తోంది. ఆగస్గు 11వ తేదీన రాజస్థాన్ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. అయితే ఆరు మంది బీఎస్ పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో కలిసి పనిచెయ్యడానికి హైకోర్టు అభ్యంతరం చెప్పలేదు. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు ఎలా చెబుతుందో? అంటూ ఇప్పుడు సీఎం అశోక్ గెహ్లెట్ వర్గానికి టెన్షన్ మొదలైయ్యింది.
సీఎంకు మ్యాజిక్ ఫిగర్
రాజస్థాన్
సీఎం
అశోక్
గెహ్లెట్
ఈనెల
14వ
తేదీన
అసెంబ్లీలో
బలప్రదర్శన
నిరూపించుకోవడానికి
సిద్దం
అవుతున్నారు.
రాజస్థాన్
సీఎం
అశోక్
గెహ్లెట్
ఆయన
సీటు
కాపాడుకోవాలంటే
మ్యాజిక్
ఫిగర్
101
ఎమ్మెల్యే
మద్దతు
అవసరం.
అయితే
ఆరు
మంది
బీఎస్
పీ
ఎమ్మెల్యేల
మద్దతు
ఇవ్వకపోతే
సీఎంకు
మద్దతు
ఇస్తున్న
ఎమ్మెల్యేల
బలం
96కు
పడిపోతుంది.
రాజస్థాన్
లో
బీజేపీకి
72
మంది
ఎమ్మెల్యేలు
ఉన్నారు.
సచిన్
పైలెట్
వర్గం
ఎమ్మెల్యేలతో
పాటు
మరో
ముగ్గురు
స్వతంత్రపార్టీ
ఎమ్మెల్యేల
మద్దతు
ఇస్తే
ప్రతిపక్షాల
బలం
(బీజేపీ)
97కు
చేరుకుంది.
Recommended Video
తేడా వస్తే సీఎంకు సినిమా
హైకోర్టు
తీర్పుతో
అటుఇటు
అయితే
రాజస్థాన్
లో
ఎవరైనా
అధికారంలో
ఉండాలంటే
అసెంబ్లీలో
మ్యాజిక్
ఫిగర్
నెంబర్
97కు
పడిపోతుంది.
ఇప్పుడు
ఏనుగు
బలం
ఉంటేనే
సీఎం
అశోక్
గెహ్లెట్
కుర్చీ
మిగులుతుంది.
కొంచెం
అటూఇటూ
అయినా
సీఎంకు
సినిమా
కనపడుతుందని
రాజకీయ
విశ్లేషకులు
అంటున్నారు.