మతం మారితేనే పెళ్ళి: ప్రియురాలి షరతు, నో చెప్పిన ప్రియుడు
జోథ్పూర్: రాజస్థాన్లో ఇద్దరు ప్రేమించుకొన్నారు. అయితే ఇద్దరు వేర్వేరు మతాలకు చెందినవారు.మతం మారితేనే వివాహం చేసుకొంటానని యువతి షరతు విధించింది. అయితే వివాహనికి ఆ యువకుడు నిరాకరించాడు. ఈ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకొంది.
ఓ వర్గం అబ్బాయి మరో మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని యువతి స్పష్టం చేసింది. దీంతో ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు.
ట్యాక్సీ డ్రైవర్గా యువకుడు 20 ఏళ్ల యువతిని ప్రేమించాడు. అతని ప్రేమకు పూజా కూడా అంగీకరించింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఇద్దరూ ఈ నెల 28న ఇంటి నుంచి పారిపోయారు. కూతురు కన్పించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు జోధ్పూర్ పోలీస్ స్టేషన్ మిస్సింగ్ కేసు పెట్టారు.
ప్రేమికులిద్దరినీ పోలీసులు బికనీర్లో అదుపులోకి తీసుకుని జోధ్పూర్ తరలించారు. పోలీసుల వీరిద్దరిరని విచారిస్తున్న తరుణంలో విషయం తెలుసుకొని ఓ వర్గం వారంతా పోలీస్స్టేషన్ను ముట్టడించారు.
స్టేషన్ బయట పెద్ద వివాదం జరుగుతున్న సమయంలో ప్రియుడు మతం మారితేనే పెళ్లి చేసుకుంటానని పోలీసులకు తెలిపారు. ప్రియుడు మతం మార్చుకునేదాకా ఎదురు చూస్తానని లేదంటే వేరే వివాహం చేసుకుంటానని ప్రియురాలు ప్రకటించడంతో వివాదం సద్దు మణిగింది.