వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్: నలుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

పాట్నా: ఢిల్లీ - డిబ్రూగర్ మార్గంలోని రాజధాని ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదం బీహార్ రాష్ట్రంలోని ఛాప్రా సమీపంలో జరిరగింది.

నలుగురు మృతి చెందిన విషయాన్ని డిఐజి వినోద్ కుమార్ ఎన్డీటివీతో మాట్లాడుతూ ధ్రువీకరించారు. ఛాప్రా నుంచి తెల్లవారు జామున 2 గంటలకు బయలుదేరిన కొద్ది సేపటికే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది.

ప్రమాదంలో 9 మంది గాయపడినట్లు వినోద్ కుమార్ చెప్పారు. ఈ ప్రమాదం వెనక కుట్ర ఏమీ లేదని ఆయన అన్నారు. డ్రైవర్‌కు ఏ విధమైన పేలుడు శబ్దం వినిపించలేదని చెప్పారు.

 Rajdhani Express derails in Bihar, 4 killed

ట్రాక్స్‌పై శబ్దం రావడంతో రైలును నిలిపేసినట్లు తెలిపారు. రైలుకు చెందిన 11 కోచ్‌లు పట్టాలు తప్పినట్లు సమాచారం. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మావోయిస్టుల పని కావచ్చునని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమానిస్తోంది.

రైల్వే, స్థానిక అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కుట్ర ఉందని రైల్వే మంత్రిత్వశాఖ అనుమానిస్తుంటే అటువంటదేమీ లేదని బీహార్ పోలీసులు అంటున్నారు.

మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారని, ఈ నేపథ్యంలోనే ఈ సంఘటనకు వారే పాల్పడి ఉండవచ్చునన రైల్వే మంత్రి సదానంద గౌడ అన్నారు. అయితే, అసలు కారణం మాత్రం తెలియదని ఆయన అన్నారు.

English summary
Four people have been killed after Delhi-Dibrugarh Rajdhani Express derailed near Chhapra in Bihar early on Wednesday morning, according to TV reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X