తిరగదోడుతున్న శారదా చిట్స్ కుంభకోణం... విచారణకు హజరుకాని రాజీవ్ కుమార్
శారదా
కుంభకోణం
ఆరోపణలు
ఎదుర్కోంటున్న
కోల్కతా
మాజీ
పోలీస్
కమీషనర్
రాజీవ్
కుమార్
నేడు
సీబీఐ
విచారణకు
డుమ్మా
కొట్టారు.
ఆయన
ఈరోజు
విచారణకు
కావాలని
సీబీఐ
నోటీసులు
పంపింది.
అయితే
రాజీవ్
కుమార్
మాత్రం
హజరు
కాలేదు.
కాగా
ఇప్పటికే
రాజీవ్
కుమార్
పై
సీబీఐ
ఉచ్చుబిగించింది.
ఆయన్ను
అరెస్ట్
చేసేందుకు
రంగం
సిద్దం
చేసింది.
ఈనేపథ్యంలోనే
రాజీవ్
కుమార్
విదేశాలకు
పారిపోకుండా
లుక్అవుట్
నోటీస్
సైతం
జారీ
చేసింది.
కాగా
ఇప్పటికే
తనను
చిట్ఫండ్
విషయంలో
ఇబ్బందులకు
గురిచేస్తున్నారని
రాజీవ్
కుమార్
కోర్టులో
అఫిడవిట్
సైతం
దాఖలు
చేశాడు.
పశ్చిమబెంగాల్, కేంద్ర ప్రభుత్వం మధ్య చిచ్చురేపుతున్న శారద చిట్ఫండ్ కుంభకోణం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించిన కీలక పత్రాలను అప్పటి కొల్కతా పోలీస్ కమీషనర్గా ఉన్నరాజీవ్ కుమార్ మాయం చేశాడిని సీబీఐ ఆరోపణలు చేస్తోంది. దీంతో ఆ కేసుకు సంబంధించి విచారణ జరుపేందుకు సిద్దమైంది.ఇక ఆయన రాకపోవడంతో అరెస్ట్కు రంగం సిద్దం చేస్తోంది.
ఈనేపథ్యంలోనే తనను అరెస్ట్ చేసేందుకు సీబీఐ చూస్తుందంటూ రాజీవ్ కుమార్ ముందస్తుగా కోర్టులో అఫిడవిట్ను దాఖలు చేశారు. దీంతో ఆయన అరెస్ట్కు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచి పోకుండా లుక్ అవుట్ నోటీస్ను జారీ చేసింది. కాగా సీబీఐ శారదా కుంభకోణానికి సంబంధించి సీబీఐ 2014 నుండి విచారణ చేపట్టింది. ఇందులో సుమారు 3500 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.