ఆర్థిక కుంభకోణంలో రజినీ: సుబ్రమణ్యస్వామి సంచలనం
న్యూఢిల్లీ: తమిళ సూపర్స్టార్ రజనీకాంత్పై భారతీయ జనతా పార్టీ రాజ్యసభసభ్యుడు సుబ్రమణ్యస్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై వస్తోన్న వార్తలపై గతంలో కూడా ఆయన తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా, రజినీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు.
'రజనీ నిరక్షరాస్యుడు. ఆయన రాజకీయాలకు సరిపోరు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో రజనీకి తెలియదు. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే హానికరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది' అని సుబ్రమణ్యస్వామి అన్నారు.
అందుకే రాజకీయాల్లో రావద్దనే తాను రజినీకి సలహా ఇస్తున్నానని అన్నారు. అంతేగాక, రజినీ ఓ ఆర్థిక కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పారు.
కాగా, సెప్టెంబరు/ అక్టోబరు నెలలో మరోసారి అభిమానులతో సమావేశమై రాజకీయ రంగ ప్రవేశం గురించి నిర్ణయం తీసుకుంటానని రజినీకాంత్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిిసందే. అప్పుడే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని అన్నారు.