భార్య విడాకులు ఇచ్చిందని మిఠాయిలు పంచి సంబరం చేసుకొన్న భర్త, ఎందుకంటే?
తన భార్య నుండి విడాకులు రావడంతో ఓ భర్త పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొన్నాడు. మిఠాయిలు పంపిణీ చేసి తన సంతోషాన్ని వ్యకం చేశాడు.
అహ్మదాబాద్:తన భార్య నుండి విడాకులు రావడంతో ఓ భర్త పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొన్నాడు. మిఠాయిలు పంపిణీ చేసి తన సంతోషాన్ని వ్యకం చేశాడు.
గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన రింకేష్ రచ్చ్ అనే వ్యక్తికి తన భార్య నుండి విడాకులు వచ్చాయి. దీంతో ఆయన మిఠాయిలు పంచి సంబరాలు చేసుకొన్నాడు.
26 ఏళ్ళ రింకేష్ జిన్నింగ్ మిల్లును నిర్వహిస్తున్నాడు. మూడేళ్ళ క్రితం ఆయనకు వివాహమైంది.అయితే పెళ్ళైన ఏడాది నుండే వేరుకాపురం పెట్టాలని భార్య ఒత్తిడి చేసింది. భర్తను వేధింపులకు గురిచేసింది.
దీంతో మానసిక క్షోభను అనుభవించానని రింకేష్ చెప్పాడు. దీంతో విడాకులకు సిద్దమైనట్టు చెప్పారాయన.అయితే చట్టాలు ఎక్కువగా మహిళలకు అనుకూలంగా ఉండడంతో న్యాయం కోసం రెండేళ్ళు పోరాటం చేసినట్టు ఆయన చెప్పారు.
ఇన్ని కష్టాలు అనుభవించిన తనకు విడాకులు మంజూరుకావడంతో రింకేష్ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. విడాకులు రావడంతో సుమారు 50 కేజీల బర్పీ మిఠాయి బాక్సులను సన్నిహితులకు, బంధువులకు పంచారు.
విడాకులు వచ్చిన విషయం తెలియగానే ఆయన సంతోషంతో ఎంజాయ్ చేశాడు.విడాకుల మంజూరైనందుకు మిఠాయిలు పంచిన విషయం సోషల్ మీడియాలో ఫోటోలు రావడంతో ఆయనను ఫోన్ చేసీ అభినందిస్తున్నట్టు చెప్పారు. మళ్ళీ పెళ్ళి చేసుకొంటానని ఆయన చెప్పారు.