వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్తగా 15 మంది ఎంపీల ప్రమాణం - తొలిరోజు రివర్స్‌లో రాజసభ - ప్రొడక్టివిటీ పెరిగిందన్న వెంకయ్య

|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే పెద్దల సభలో కొత్తగా లేదా తిరిగి ఎన్నికైన 15 మంది ఎంపీలు ప్రమాణాలు చేశారు. వివిధ రాష్ట్రాలకు చందిన ఆ ఎంపీల చేత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణాలు చేయించారు. లోక సభ వాయిదా అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్యసభ ప్రారంభంకాగా... ముందుగా దివంగత నేతలకు నివాళులు అర్పించారు. వాయిదా అనంతరం కొత్త సభ్యుల ప్రమాణస్వీకారాలు జరిగాయి.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. 2014(కేంద్రంలో మోదీ సర్కార్ ఎన్నికైన) తర్వాత నుంచి పార్లమెంట్ నడుస్తోన్న తీరులో మంచి మార్పులు వచ్చాయని, 2014 కంటే పాతికేళ్ల ముందుతో పోల్చుకుంటే ప్రస్తుం పార్లమెంట్ ప్రొడక్టివిటీ బాగా పెరిగిందని అన్నారు. కొత్త‌గా ప్రమాణాలు చేసిన స‌భ్యుల‌ను చైర్మన్ అభినందించారు.

Rajya Sabha: Productivity increased since 2014, says Venkaiah Naidu, 15 new MPs take oath

రాజ్యసభ సభ్యులుగా సోమవారం ప్రమాణాలు చేసినవారిలో అజిత్ కుమార్ భూయాన్(ఇండిపెండెంట్), ఫులో దేవి నేతం(కాంగ్రెస్), శిబు సోరెన్(జేఎంఎం) ఎం.వి.శ్రయమ్స్ కుమార్(ఎల్జేడీ) ఫౌజియా ఖాన్(ఎన్సీపీ), వాన్వీరోయ్ ఖార్లుఖి(ఎన్పీపీ), ఎన్ఆర్ ఎలాంగో (డిఎంకె), సెల్వరాసు (డిఎంకె), టి.శివ (డిఎంకె), కె.కేశవ రావు, (టిఆర్‌ఎస్); కె.ఆర్.సురేష్ రెడ్డి (టిఆర్ఎస్); సయ్యద్ జాఫర్ ఇస్లాం (బిజెపి); జై ప్రకాష్ నిషాద్ (బిజెపి), అర్పితా ఘోష్, (టిఎంసి), దినేష్ త్రివేది (టిఎంసి) ఉన్నారు. కాగా,

Recommended Video

షాకింగ్.. MP Sumalatha Ambareesh కు COVID-19 పాజిటివ్! || Oneindia Telugu

వర్షాకాల భేటీకి సంబంధించిన షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకురాజ్యసభ జరుగుతుందని, శానిటైజేషన్ చేపట్టిన తర్వాత మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 వరకు లోక్ సభ సమావేశం కావాల్సి ఉంది. అయితే తొలిరోజైన సోమవారం మాత్రం రివర్స్ లో.. ముందు లోక్ సభ, ఆ తర్వాత రాజ్యసభ కొలువుదీరడం కొలువుదీరాయి. కాగా, మంగళవారం నుంచి మాత్రం ఉదయం రాజ్యసభ, మధ్యాహ్నం లోక్ సభ జరగనున్నాయి.

English summary
Vice President and Rajya Sabha Chairman Venkaiah Naidu said on Monday that the productivity of parliament has improved since 2014 as compared to 25 years prior to that. Fifteen persons from various states, who have been elected to the Rajya Sabha (RS), took oath on Monday when the Upper House reconvened for business after five months for an 18-day uninterrupted monsoon session of Parliament amid the coronavirus disease (Covid-19) outbreak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X