వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెన్సార్ చీఫ్‌ని గద్దె దింపుతా, నేనే బెస్ట్: రాఖీ సావంత్

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ నటి రాఖీ సావంత్ సెన్సార్ బోర్డు పైన మండిపడింది. సెన్సార్‌ బోర్డ్‌ చీఫ్‌ పహ్లజ్‌ నిహ్లానీ, నటి సన్నీ లియోనీలను ఆమె లక్ష్యంగా చేసుకుంది. రాఖీ సావంత్‌ కథానాయికగా నటించిన చిత్రం 'ఏక్‌ కహానీ జూలీ కీ'.

ఇటీవల సెన్సార్‌ బోర్డ్‌ ఈ చిత్రానికి యూ-ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఏ సర్టిఫికెట్‌గా మార్చింది. దాంతో సెన్సార్‌ బోర్డ్‌ పైన రాఖీ సావంత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పహ్లజ్‌ని సెన్సార్ బోర్డు చీఫ్ పదవి నుంచి దింపుతానని చెప్పింది.

Rakhi Sawant's Angry Rant Against Censor Board

అతను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తి అని మండిపడింది. ఈ సెన్సార్‌ బోర్డ్‌ని మూసేయాలని, వాళ్లు పెద్ద నిర్మాతల నుంచి డబ్బులు తీసుకుంటూ చిన్న నిర్మాతల్ని హేళన చేస్తున్నారని, సెన్సార్‌ బోర్డులో ఉన్నవారంతా చదువు లేని వారేనన్నారు.

పహ్లాజ్ నిహలానీ కంటే నేనే ఆ పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలనని పేర్కొన్నారు. మేము అతనికి డబ్బు ఇవ్వనందుకే మాకు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చారో, లేక ఐటం సాంగ్స్‌ చేసే నేను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించానని అలా చేశారో తెలీడం లేదన్నారు. నేనో భారతీయురాలినని, బాలీవుడ్‌ నటిని, ఐటం గర్ల్‌ని అని, అంతేకానీ పోర్న్‌స్టార్‌ని మాత్రం కాదని పరోక్షంగా సన్నీలియోన్ పైన మండిపడ్డారు.

English summary
Rakhi Sawant's Angry Rant Against Censor Board Is Apt And For Once, It Actually Makes Sense!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X