కర్ణాటక కేసులో ఇంప్లీడ్ అవుతా: సుప్రీంలో రాంజెఠ్మలానీ పిటిషన్
న్యూఢిల్లీ: కర్ణాటక పరిణామాలపై సుప్రీం కోర్టులోకేసు పెండింగ్ లో ఉంది. ఈ కేసులో తాను కూడ ఇంప్లీడ్ అయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయమాది రాంజెఠ్మలానీ గురువారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును బుధవారం నాడు ఆశ్రయించింది. అయితే ఈ విషయమై అర్ధరాత్రి పూట సుప్రీంకోర్టు రెండు వర్గాల వాదనలను విన్నది. అయితే ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం చేయకుండా ఉండేందుకు స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో గురువారం నాడు ఉదయం పూట యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
బిజెపికి మెజారిటీ లేకపోయినా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి గవర్నర్ ఆహ్వానించిన విషయమై సుప్రీంకోర్టును కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించింది.ఈ కేసులో తనను కూడ ఇంప్లీడ్ అయ్యే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ గురువారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే సరైన బెంచ్ ముందు ప్రస్తావించాలని ధర్మాసనం సూచించింది. వ్యక్తిగత హోదాలో గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. రాంజెఠ్మలానీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.