వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రామ మందిర నిర్మాణంపై అమిత్ షా మరోసారి
అయోధ్యలో రామమందిరంపై బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా మరోసారి స్పందించారు. అయోధ్యలో రామ మందిరంపై చర్చల అనంతరం, చట్టబద్ధంగా నిర్మించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
జైపూర్: అయోధ్యలో రామమందిరంపై బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా మరోసారి స్పందించారు. అయోధ్యలో రామ మందిరంపై చర్చల అనంతరం, చట్టబద్ధంగా నిర్మించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
గత నాలుగు లోకసభ ఎన్నికల మేనిఫెస్టోలో తమ పార్టీ ఈ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపిందన్నారు. ఎస్సీ, ఎస్టీలలో బాగా సంపాదించిన కుటుంబాలను రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి మినహాయించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ విషయమై పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని రాష్ట్రాల్లో లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలనే విషయం అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతనే ఎన్నికల కమిషన్తో మాట్లాడుతామన్నారు.
Comments
English summary
BJP President Amit Shah has said that his party wants the Ram temple in Ayodhya to be constructed in a legal manner after mutual dialogue. "The party's stand is clear and mentioned in the last four Lok Sabha election manifestos. The temple should be constructed in a legal manner and there should be mutual dialogue," he said at a press conference in Jaipur.
Story first published: Sunday, July 23, 2017, 16:55 [IST]