పాక్, బంగ్లాదేశ్ సైన్యానికి స్వీట్లను పంచి పెట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు
న్యూఢిల్లీ: భారత సరిహద్దు భద్రతా బలగాలు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ సైనికులకు స్వీట్లను పంచి పెట్టాయి. పంజాబ్, పశ్చిమ బెంగాల్లల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ దృశ్యాలు కనిపించాయి.
Attari-Wagah Border: Border Security Force personnel exchange sweets with their Pakistani counterparts on the occasion of #EidUlFitr today. pic.twitter.com/QxvpLzxK2D
— ANI (@ANI) June 5, 2019
రంజాన్ పండగ సందర్భంగా పంజాబ్లోని అట్టారీ-వాఘా సరిహద్దులో విధి నిర్వహణలో నిమగ్నమైన మనదేశ సరిహద్దు దళానికి చెందిన జవాన్లు పాకిస్తాన్ వైపు పహారా కాస్తోన్న ఆ దేశ సైనికులను జీరో పాయింట్ ప్రదేశానికి ఆహ్వానించారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారికి స్వీట్ పాకెట్లను అందజేశారు. దీనికి ప్రతిగా- పాకిస్తాన్ సైనికులు కూడా మన దేశ బీఎస్ఎఫ్ జవాన్లకు స్వీట్లను పంచి పెట్టారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదే తరహా సన్నివేశాలు పశ్చిమ బెంగాల్లోని సిలిగురి సమీపంలో బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనూ కనిపించాయి. సిలిగురి జిల్లా ఫుల్బరీ సమీపంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు బంగ్లాదేశ సైన్యానికి స్వీట్ల బాక్సులను పంచి పెట్టారు. వారికి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
Border Security Force personnel exchanged sweets with Border Guards Bangladesh personnel in Fulbari, at Indo-Bangladesh border near Siliguri in West Bengal. #EidUlFitr pic.twitter.com/sRKf6hG375
— ANI (@ANI) June 5, 2019
రోడ్డుపైకి ఈడ్చి..గాయాలపై కారం పూసి! కన్నతండ్రిపై అమానవీయ దాడికి దిగిన కుమారుడు