కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలె చెంపపై కొట్టిన యువకుడు, బంద్కు పిలుపు
ముంబై: కేంద్రమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ-ఏ) అధ్యక్షులు రామ్దాస్ అథవాలే పైన ఓ దుండగుడు దాడి చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. అంబర్నాథ్లో శనివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో అథవాలే పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో ఊహించని విధంగా ఆయనకు చేదుఅనుభవం ఎదురైంది.
హఠాత్తుగా కేంద్రమంత్రి వైపు దూసుకొచ్చిన ఓ వ్యక్తి ఆయన చెంపను చెళ్లుమనిపించాడు. వెంటనే తేరుకున్న ఆయన అనుచరులు ఆగంతుకుడిని పట్టుకుని చితకబాదారు. నిందితుడిని ప్రవీణ్ గోసావిగా గుర్తించారు. కేంద్రమంత్రిని కొట్టడంతో అతని అనుచరుల అతనిపై దాడి చేసారు. ఈ ఘటనలో అతనికి గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు.
#WATCH Maha: People thrash Pravin Gosavi, a worker of the youth wing of Republican Party of India, who slapped Union Minister & party leader Ramdas Athawale at an event in Thane y'day. Gosavi has been admitted to a hospital. FIR registered against him, investigation on. (08.12) pic.twitter.com/zvYmNaV8Wi
— ANI (@ANI) December 9, 2018
అథవాలే పైన ప్రవీణ్ ఎందుకు దాడి చేశాడనే విషయం తెలియాల్సి ఉంది. ఈ దాడి విషయం తెలియడంతో అథవాలే అభిమానులు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పథకం ప్రకారమే ఆయనపై దాడి జరిగిందని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రిపై దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు.