పరిశ్రమలన్నీ హైదరాబాదులోనే, ఎపికి ప్రత్యేక హోదా: రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కె. రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని కోరారు. సోమవారం ఉదయం లోక్సభలో ఆ విషయంపై మాట్లాడారు. విభజన చట్టంలో చెప్పిన విధంగా 15 సంవత్సరాల పాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్నారు.
ప్రత్యేక హోదా విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్రానికి విన్నవించారన్నారు. పరిశ్రమలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయని అంటూ ఏపీకి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కల్పించాలని ఎంపీ రమ్మోహన్నాయుడు కేంద్రాన్ని కోరారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే సోమవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో నిరసన నిర్వహించారు. సహారా కుంభకోణంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. సహారా కుంభకోణం విచారణలో ఒక డైరీ దొరికిందని, అందులో అమిత్ షా పేరు ఉందని ఎంపీలు ఆరోపించారు.
సహారా స్కాంలో అమిత్షా ప్రమేయంపై దర్యాప్తు జరిపించాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు.ఆదివారం కోల్కత్తాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా శారదా చిట్స్ స్కామ్లోనూ, బర్దన్ పేలుళ్ల ఘటనలోనూ తృణమూల్ పార్టీకి సంబంధం ఉందని ఆయన ఆరోపించిన విషయం విధితమే. దానికి జవాబుగా అన్నట్లు టీఎంసీ ఎంపీలు సోమవారం అమిత్షాను లక్ష్యం చేసుకున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications