వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ సంగతేంటి సర్?: మోడీపై రమ్యకు కోపమొచ్చింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన మాండ్య కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థి, ప్రముఖ నటి రమ్యకు కోపం వచ్చింది. మోడీ పైన రమ్య విరుచుకు పడటం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. ఎన్నికల్లో మీ అజెండా ఏమిటని మోడీని రమ్య ప్రశ్నించారు.

రమ్య మాండ్య లోకసభ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆమె జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా విపక్షాలపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మోడీ పైన ఆమె సెటైర్ వేశారు. మోడీలో ఓ నైపుణ్యం అద్భుతమని, ఎలా తప్పించుకోవాలో ఆయనకు బాగా తెలుసునని ఎద్దేవా చేశారు.

Ramya

ఆ తర్వాత మోడీ పైన ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. కాంగ్రెసు పార్టీ రాహుల్ గాంధీ ఫ్యూచర్ అనే సింగిల్ అజెండాతో ముందుకు పోతోందని మోడీ చెబుతున్నారని... అయితే మీ సంగతేమిటని ఆమె ట్వీట్ చేశారు.

తాను ఇటీవల అహ్మదాబాదుకు వెళ్లానని, అక్కడ మోడీ చెబుతున్న అభివృద్ధి కనిపించ లేదని ఆమె అన్నారు. అహ్మదాబాదులో పట్టణాభివృద్ధి కనిపించినప్పటికీ.. హ్యూమన్ డెవలప్ మెంట్ మాత్రం లేదన్నారు. కచ్చితమైన లెక్కలు తీస్తే.. గుజరాత్ అభివృద్ధి కర్నాటక కంటే కింద ఉంటుందన్నారు. గుజరాత్ కంటే హర్యానా బాగా అభివృద్ధి చెందిందన్నారు.

English summary
It is not for the first time actor-politician Ramya 
 
 has openly criticised Bharatiya Janata Party's Prime 
 
 Ministerial candidate Narendra Modi. Ramya, who is 
 
 contesting the upcoming Lok Sabha election from 
 
 Mandya as a Congress candidate and a sitting Congress 
 
 MP from the constituency, has once again questioned 
 
 Modi's agenda for the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X