ప్రధాని నరేంద్ర మోడీ జాకెట్ ధర ఎంత అని ట్వీట్ చేసిన నటి రమ్య, ఎవరి క్రిడెట్ కార్డు!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్, బహుబాష నటి రమ్య మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకున్నారు. శాసన సభ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి మొదటిసారి కర్ణాటకకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించిన రమ్యకు సోషల్ మీడియాలో బీజేపీ మద్దతుదారులు పలు ప్రశ్నలు వేస్తున్నారు.
నరేంద్ర మోడీ గారు మీరు ధరించిన లోరో పియానా జాకెట్ నాకు చాలా ఇష్టం అయ్యింది. కేవలం 17,000 యూరోలు మాత్రమే, చాల చీప్ (తక్కువ ధర), ఎవరి క్రెడిట్ కార్డులో తీసుకున్నారు అంటూ మంగళవారం నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ రమ్య ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన లోరో పియానా జాకెట్ పై కామెంట్ ట్వీట్ కు బీజేపీ మద్దతుదారులు రమ్యకు సవాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య వేసుకున్న రూ. 70 లక్షల విలువైన హుబ్లో వాచ్, రాహుల్ గాంధీ ధరించిన జాకెట్ విలువ ఎంతో చెప్పగలరా, వాటిని ఎవరి అకౌంట్ లో తీసుకున్నారు కాస్త వివరించండి మేడమ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.
.@narendramodi ji so fancy! I love the Loro Piana jacket on you! Only 17,000 Euros! Very cheap. Who’s credit card was used to pay for this Modi ji? pic.twitter.com/yK2nsAG63O
— Divya Spandana/Ramya (@divyaspandana) May 1, 2018
.@narendramodi ji so fancy! I love the Loro Piana jacket on you! Only 17,000 Euros! Very cheap. Who’s credit card was used to pay for this Modi ji? pic.twitter.com/yK2nsAG63O
— Divya Spandana/Ramya (@divyaspandana) May 1, 2018
ರಾಹುಲ್ ಗಾಂಧಿಯ ಸಲಹೆ ಕೇಳಿ. pic.twitter.com/2iCyZoh8rM
— mahaling (@khanagaonmb) May 1, 2018