'బాలికపైఅత్యాచారం చేసిన హోంమంత్రి అత్యాచారం ',నాకేమీ తెలియదు
మేఘాలయ హోంమంత్రి డొంకుపర్ రాయ్ 14 ఏళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఆరోపణలతో ఆయనను మంత్రివర్గం నుండి తొలగించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
షిల్లాంగ్ :మేఘాలయ రాష్ట్ర హోంశాఖ మంత్రి హోర్జు డోంకుపర్ రాయ్ ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశారని బిజెపి ఆరోపణలు గుప్పిస్తోంది.ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని భర్తరప్ చేయాలని డిమాండ్ చేసింది ఆ పార్టీ.
ఇప్పటికే మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్ రాజీనామా చేశారు. మేఘాలయ రాజ్ భవన్ అమ్మాయిల క్లబ్ గా మారిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు కొందరు రాష్ట్రపతికి లేఖ రాశారు.దీంతో షణ్ముగనాథన్ రాజీనామా చేశారు.
షణ్ముగనాథన్ రాజీనామా వార్తను మర్చిపోకముందే అదే తరహ వార్త మరోకటి చోటుచేసుకొంది. షిల్లాంగ్ లోని మార్వలీన్స్ ఇన్ పేరిట హోంమంత్రి తనయుడు ఓస్బర్ట్ రిమ్మీ ఓ గెస్ట్ హోస్ ను నిర్వహిస్తున్నాడు.
ఈ గెస్ట్ హౌజ్ లో 14 ఏళ్ళ బాలికను నలుగురు వ్యక్తులు వేర్వేరుగా అత్యాచారం చేశారనే వార్తలు వచ్చాయి. ఈ నలుగురిలో హోంమంత్రి డోంకుపర్ రాయ్ కూడ ఉన్నారని బిజెపి ఆరోపిస్తోంది.
మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయ్ రాజీనామా చేయాలని బిజెపి పట్టుబడుతోంది.అయితే తానెలాంటి తప్పు చేయలేదని రాజీనామా చేసే ప్రసక్తేలేదని హొంమంత్రి చెబుతున్నారు.
గెస్ట్ హౌజ్ ను తాను నిర్వహించడం లేదని మంత్రి ప్రకటించారు. ఈ కేసు విషయంలో వాస్తవాలను వెలికితీసే విషయంలో పోలీసులకు పూర్తిస్వేచ్చను ఇచ్చానని ఆయన ప్రకటించారు. షణ్ముగనాథన్ అంశాన్ని రాజకీయం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, హోంమంత్రిని ఎందుకు వెనకేసుకు వస్తున్నారని బిజెపి ప్రశ్నిస్తోంది.