తల్లీ, కుమార్తెపై లైంగిక దాడి, బాలుడి హత్య, దళిత ఫ్యామిలీ, కామాంధులు, ఉరి శిక్ష!
చెన్నై: దళిత కుటుంబంపై సామూహిక దాడి చేసి తల్లి, కుమార్తెపై లైంగిక దాడి చేసి 8 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన గ్యాంగ్ ను కఠినంగా శిక్షించాలని, కామాంధులకు ఉరి శిక్ష వెయ్యాలని పలు రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న తల్లీ, కుమార్తె త్వరగా కోలుకోవాలని దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు.
తండ్రి లేడని దారుణం
తమిళనాడులోని విల్లుపురం జిల్లా వెల్లంపుత్తూరు గ్రామంలో 37 ఏళ్ల మహిళ ఆమె భర్త చనిపోవడంతో కుమార్తె (14), కుమారుడు (8)తో కలిసి నివాసం ఉంటున్నది. బాలిక తండ్రి లేడని తెలుసుకున్న కొందరు కామాంధులు ఆ కుటుంబం మీద నిఘా వేశారు.
తల్లీ, కుమార్తెపై కన్ను
గత వారం దళిత మహిళ కుటుంబ సభ్యులపై కొందరు దాడి చేశారు. దుండగుల దాడి చేసి 8 ఏళ్ల బాలుడిని చంపేశారు. తరువాత తల్లీ, కుమార్తె మీద దాడి చేసి సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు చాకచక్యంగా పరారైనారు.
కరుణానిధి కుమార్తె ఫైర్
విల్లుపురం జిల్లాలో కామాంధులు బాలుడిని దారుణంగా హత్య చేశారని, అతని తల్లి, సోదరి మీద హత్యాయత్నం చేసి అత్యాచారం చేశారని, అయినా ఇంత వరకూ ఈ కేసులో ఒక్కరినీ అరెస్టు చెయ్యలేదని డీఎంకే పార్టీ రాజ్యసభ సభ్యురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమోళి మండిపడ్డారు.
మానవత్వం మరణించింది
దళిత కుటుంబం మీద దాడి చేసి బాలుడిని హత్య చేసి, తల్లీ, కుమార్తెను లైంగికంగా వేధింపులకు గురి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రముఖ తమిళ హీరో ప్రసన్న డిమాండ్ చేశారు. తన సొంత జిల్లాలో ఇలాంటి దారుణం జరగడంతో మానవత్వం మరణించిందని అనిపిస్తోందని ప్రముఖ హీరో ప్రసన్న విచారం వ్యక్తం చేశారు.
ఉరి శిక్ష వెయ్యాలి
బహుబాష నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కుషుబు సుందర్ మాట్లాడుతూ ఇలాంటి నేరాలు చేసే వారికి ఉరి శిక్షే సరైన శిక్ష అని అన్నారు. తల్లీ, కుమార్తెకు తీవ్రగాయాలై ఐయుసీలో చికిత్స పొందుతున్నారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కుషుబు మనవి చేశారు.