బాధితురాలిపై ఆసుపత్రిలో మళ్లీ రేప్
జంషెడ్ పూర్: అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక (15) మీద మళ్లీ అత్యాచారం చేసిన సంఘటన జార్ఖండ్ లో జరిగింది. జంషెడ్ పూర్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగిందని సీనియర్ ఎస్పీ అనూప్ టి. మాథ్యూ చెప్పారు.
సీనియర్ ఎస్పీ అనూప్ టి. మ్యాథ్యూ కథనం మేరకు జంషెడ్ పూర్ లో ఓ బాలిక (15) నివాసం ఉంటున్నది. ఈమె మీద ఓ యువకుడు మూడు రోజుల క్రితం అత్యాచారం చేశాడు. బాలిక ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరిక్షలకు తరలించారు. యువకుడిని న్యాయస్థానం ముందు హాజరిచారు. న్యాయమూర్తి బాలుడిని రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి బాలిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
అదే ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వ్యక్తి ఆదివారం రాత్రి బాలిక మీద మళ్లీ అత్యాచారం చేశాడు. బాలిక ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్యూరిటీ గార్డు పరారైనాడని, మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సోమవారం సీనియర్ ఎస్పీ అనూప్ టి. మ్యాథ్యూ తెలిపారు.