అంధురాలిపై 9 మంది అత్యాచారం, న్యాయం చేయకపోతే ఆత్మహత్యే...!
జైపూర్: రాజస్ధాన్లో దారుణం జరిగింది. ఓ అంధురాలిపై మూడు నెలల్లో తొమ్మిది మంది అతికిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్ధాన్లోని మోతాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందనఖేడి గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ఆమె తన ఇంటి ముందు కూర్చుని ఉండగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఆమెను కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను ఎవరికీ తెలియని ఓ ఇంట్లో ఉంచి మూడు నెలల వ్యవధిలో మొత్తం తొమ్మిది మంది ఆమెపై అత్యాచారం చేశారు.
మోజు తీరిన తర్వాత ఆమెను కోట అనే ఊరిలో రూ. 50 వేలకు అమ్మకానికి పెట్టారు. అంధురాలు కావడంతో ఆమెను ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో చేసేదేమి లేక నిందితుడు ఆమెను తిరిగి ఇంటి ముందు వదిలి వెళ్లిపోయాడు.
బాధితులు తన ఫిర్యాదులో ఇలా పేర్కొందని పోలీసులు తెలిపారు. పోలీసులు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితులు చెప్పిందన్నారు. దీంతో జిల్లా ఎస్పీ సత్యేంద్ర సింగ్ కేసును పరిష్కరించి బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.