వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంధురాలిపై 9 మంది అత్యాచారం, న్యాయం చేయకపోతే ఆత్మహత్యే...!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్ధాన్‌లో దారుణం జరిగింది. ఓ అంధురాలిపై మూడు నెలల్లో తొమ్మిది మంది అతికిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్ధాన్‌లోని మోతాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందనఖేడి గ్రామంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ఆమె తన ఇంటి ముందు కూర్చుని ఉండగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఆమెను కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను ఎవరికీ తెలియని ఓ ఇంట్లో ఉంచి మూడు నెలల వ్యవధిలో మొత్తం తొమ్మిది మంది ఆమెపై అత్యాచారం చేశారు.

Raped by 9 men for 3 months after abduction, girl threatens suicide if justice is denied

మోజు తీరిన తర్వాత ఆమెను కోట అనే ఊరిలో రూ. 50 వేలకు అమ్మకానికి పెట్టారు. అంధురాలు కావడంతో ఆమెను ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో చేసేదేమి లేక నిందితుడు ఆమెను తిరిగి ఇంటి ముందు వదిలి వెళ్లిపోయాడు.

బాధితులు తన ఫిర్యాదులో ఇలా పేర్కొందని పోలీసులు తెలిపారు. పోలీసులు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితులు చెప్పిందన్నారు. దీంతో జిల్లా ఎస్పీ సత్యేంద్ర సింగ్ కేసును పరిష్కరించి బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

English summary
In a horrific incident, a girl was raped by nine men for three months and later attempted to sell her for Rs 50,000 in Kota.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X