‘కాంగ్రెస్ హద్దు మీరొద్దు.. 30 ఏళ్ల బంధానికి తూట్లు’
లోక్సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అంశాన్ని కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తి ఆందోళనకు దిగడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభా మర్యాదలు పాటించకుండా కాంగ్రెస్ హద్దు మీరి ప్రవర్తించింది. మార్షల్తో వారు అనుసరించిన విధానం సరికాదు. సిబ్బందిపై ఇద్దరు ఎంపీలు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నాం అని ఆయన అన్నారు. లోక్సభలో కాంగ్రెస్ రగడపై ఆయన ఘాటుగా స్పందిస్తూ..
మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం సరైన చర్యనే అని అన్నారు. బీజేపీ, శివసేన పూర్తి మెజారిటీ లభించింది. అయితే స్వప్రయోజనాలకు శివసేన కాంగ్రెస్తో చేతులు కలిపి 30 ఏళ్ల బంధానికి తూట్లు పొడిచింది అని రవిప్రకాశ్ అన్నారు.
ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో సీఎంగా ఫడ్నవీస్తో గవర్నర్ ప్రమాణం చేయించడం అనౌతికమని సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. వారికి పూర్తి మెజారిటీ ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్ను శివసేన ఎందుకు కలువలేదని ప్రశ్నించారు. ఇక తాజాగా పరిణామాల మధ్య ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనకు సరైన సంఖ్యాబలం లేదని ఆయన అన్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజిత్ పవార్పై ఫడ్నవీస్ చేతులు కలపడంపై అడిగిన ప్రశ్నకు బీజేపీ నేత నారాయణ రాణే సమాధానం దాటవేశారు. అధికారంలో ఉండేందుకు బీజేపీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. అలాంటి చేపట్టేందుకు సిద్ధంగా ఉందని నారాయణ రాణే అన్నారు.