వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాతనోట్లతో నిండిన ఖజానా, స్థలం లేక ప్రింటింగ్ తగ్గించిన ఆర్బీఐ
ఆర్బీఐ కొత్త నోట్ల ముద్రణను తగ్గించింది. గత అయిదేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం కరెన్సీ నోట్ల ముద్రణ కోసం తక్కువగా ఆర్డర్ చేసిందని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఆర్బీఐ కొత్త నోట్ల ముద్రణను తగ్గించింది. గత అయిదేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం కరెన్సీ నోట్ల ముద్రణ కోసం తక్కువగా ఆర్డర్ చేసిందని తెలుస్తోంది.
కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను భద్రపరిచేందుకు స్థలం లేకపోవడం వల్లే ఆర్డర్ తగ్గించిందని చెబుతున్నారు. ఆర్బీఐ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2800 కోట్ల నోట్లను ముద్రించింది.
ఈసారి మాత్రం 2100 కోట్ల నోట్లకు ఆర్డర్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంకుల్లోని ఖజానాలు పాతనోట్లు, కొత్త నోట్లతో ఇప్పటికే నిండిపోయాయి. దీంతో కొత్తగా ముద్రించే నోట్లు భద్రపరిచేందుకు స్థలం లేక ఆర్డర్లు తగ్గించిందని చెబుతున్నారు.
Comments
English summary
The Reserve Bank of India (RBI) has reduced its order for printing bank notes in the current financial year to the lowest in five years for lack of space in the currency chests of the central bank and commercial banks, two people familiar with the matter said.
Story first published: Thursday, November 9, 2017, 12:55 [IST]