వృద్ధిరేటు అంచనా తగ్గించిన ఆర్బీఐ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ వృద్ధి రేటు అంచనాను తగ్గించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రేట్ 7.4గా నమోదవుతుందని ఫిబ్రవరిలో ప్రకటించిన కేంద్ర బ్యాంకు ప్రస్తుతం ఆ అంచనాను 7.2 శాతానికి పరిమితం చేసింది. ఈ ఏడాది రుతుపవనాలపై ఎల్నినో ప్రభావం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో ఆర్బీఐ వృద్ధి రేటు అంచనాను తగ్గించింది.
ఎన్నికల మహత్యం.. 2వేల నోటు మాయం..
దేశీయంగా పెట్టుబడులు తగ్గడం, మూలధన వస్తువుల ఉత్పత్తి తగ్గి దిగుమతులు పెరగడం జీడీపీపై ప్రభావం చూపుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. దీనికి తోడు ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక పరిణామాలు భారత ఎగుమతులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. ఫలితంగా అది వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటోంది. అయితే కమర్షియల్ సెక్టార్లో నిధుల వెల్లువ ఆర్థిక వ్యవస్థను ఒడిదొడుకులకు లోనుకాకుండా చూస్తుందని ఆర్బీఐ ఆశిస్తోంది.
ఆర్బీఐ ప్రస్తుత అంచనాల ప్రకారం 2019-20లో భారత వృద్ధి రేటు 7.2శాతం నమోదుకానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో జీడీపీ గ్రోత్ రేట్ 6.8 నుంచి 71 శాతం ఉండొచ్చని, రెండో అర్థభాగంలో మాత్రం 7.3 నుంచి 7.4 శాతంగా నమోదుకావచ్చని అంచనా వేస్తోంది. ఎల్నినో ప్రభావం, ద్రవ్యోల్బణం, ఆహార పదార్థాల ఉత్పత్తి, డిమాండ్పై వృద్ధి రేటు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.