ఖాతాదారులూ జాగ్రత్త!: అది నకిలీ వెబ్సైట్ అంటూ ఆర్బీఐ వార్నింగ్
ముంబై: ఆర్బీఐ పేరిట ఓ నకిలీ వెబ్సైట్ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతోందని, ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని భారత రిజర్వు బ్యాంక్ హెచ్చరించింది. ఖాతాదారుల నుంచి బ్యాంక్ వివరాలను సేకరిస్తుండటంతో ఆర్బీఐ మేరకు స్పందించింది.
ఖాతాదారులు ఇలాంటి నకిలీ వెబ్ సైట్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులకు సూచిస్తూ గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. 'దయచేసి ఆ వెబ్సైట్ను ఎవరూ నమ్మకండి. అది నకిలీది. ఎవరూ తమ ఖాతాకు సంబంధించిన వివరాలను ఇవ్వొద్దు. బహుశా అది ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ముఠా అయి ఉండొచ్చు' అని ఆర్బీఐ పేర్కొంది.
అంతేగాక, 'సదరు వెబ్సైట్ వ్యవహారంపై సైబర్ విభాగానికి ఫిర్యాదు చేశాం. ఆర్బీఐ ఏనాడూ వినియోగదారుడి వివరాలను ప్రశ్నించదు. గమనించగలరు' అంటూ తన ప్రకటనలో ఆర్బీఐ పేర్కొంది. www.indiareserveban.org పేరుతో ఆ వెబ్సైట్ చెలామణి అవుతున్నట్లు వెల్లడించింది.