స్మృతిఇరానీ శాఖ మార్పు వెనుక అసలు కారణం ఇది
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీని హెచ్ఆర్డీ శాఖ నుంచి తప్పించి, ప్రాధాన్యం లేని జౌళీ శాఖను కేటాయించారు. స్మృతిని తప్పించడం వెనుక ఎవరో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 2014 నుంచి హెచ్ఆర్డీ మంత్రిగా ఉన్న ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
స్మృతి ఇరానీకి శాఖ మార్పు వెనుక ఓ బీజేపీ ప్రముఖ నేత హస్తం ఉందని కొందరు చెబుతుండగా, మరోవైపు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అని మరికొందరు గుసగుసలాడుతున్నారు. అసలు, స్మృతి శాఖను మార్పు చేయడం ప్రధాని మోడీకి ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది.
కానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం మేరకు ఆమెకు జౌళి శాఖను అప్పగించారని అంటున్నారు. జౌళీ శాఖ కేటాయింపు పైన స్మృతి ఇరానీ కూడా అప్ సెట్ అయ్యారని తెలుస్తోంది.
విద్యార్హతలు, జెఏఎన్యూ వివాదం, వేముల రోహిత్ ఆత్మహత్య తదితర అంశాలు స్మృతి ఇరానీకి ఇబ్బందికరంగా మారాయి. ఆమె తీరు ఆరెస్సెస్కు కూడా నచ్చలేదని అంటున్నారు. ఈ కారణం వల్లే వివాదాలు లేని ప్రకాశ్ జవదేకర్కు ఆ శాఖ అప్పగించారని అంటున్నారు.