వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Rebel: ఊపుకుంటూ వెళ్లిపోయిన సంకీర్ణ ప్రభుత్వం, సీఎం, గవర్నర్ భేటీకి ఏక్ నాథ్ షిండే సిద్దం, ఎమ్మెల్యేలు !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/గుహవాటి: శివసేన పార్టీ రెబల్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఇంటికి వెళ్లడానికి సిద్దం అయ్యింది. ఏక్ నాథ్ షిండే ఏ ముహూర్తాని తిరుగుబాటు చేశాడో కాని శివసేనతో పాటు మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బ పడింది. శివసేనకు చెందిన సీఎం, ఎన్సీపీకి చెందిన హోమ్ మంత్రితో పాటు మహారాష్ట్ర ఇంటిలిజెన్స్ నిర్లక్షం కారణంగా ఆ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం పని అయిపోయింది. రెబల్ ఎమ్మెల్యేలతో చర్చించిన తరువాత ఏక్ నాథ్ షిండే ఈరోజు (గురువారం) మహారాష్ట్ర గవర్నర్ ను కలిసి తనకు మద్దతు ఇష్తున్న ఎమ్మెల్యేల వివరాలు, ఎందుకు తిరుగుబాటు చెయ్యాల్సి వచ్చిందో అనే విషయంపై చర్చించడానికి సిద్దం అవుతున్నారని ఆయనకు సన్నిహితుడైన ఓ నాయకుడు అంటున్నారు.

 ఎన్ని చేసినా ఏమి లాభం ?

ఎన్ని చేసినా ఏమి లాభం ?

శివసేన పార్టీ రెబల్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఇంటికి వెళ్లడానికి సిద్దం అయ్యింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే రాజీనామాతో మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. గురువారం అసెంబ్లీలో ఎదురైయ్యే పరిస్థితి ఊహించి ముందుగానే పరువు కాపాడుకోవడానికి సీఎం ఉద్దవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారని శివసేన నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.

అన్ని ప్రయత్నాలు విఫలం

అన్ని ప్రయత్నాలు విఫలం

రెబల్ ఎమ్మెల్యేలను ముంబాయి పిలిపించుకోవడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఆయన మద్దతుదారులు అనేక ప్రయత్నాలు చేశారు. గవర్నర్, సుప్రీం కోర్టు ఆదేశాలతో ఉద్దవ్ ఠాక్రేకి వేరే మార్గం లేక ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారని, అసెంబ్లీలో పరువు పోకముందే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయనకు సన్నిహితంగా ఉంటున్న ఓ నాయకుడు మరాఠీ మీడియాతో అన్నారు.

ఏక్ నాథ్ దెబ్బతో ఎటుకాకుండా పోయిన సీఎం

ఏక్ నాథ్ దెబ్బతో ఎటుకాకుండా పోయిన సీఎం

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 288, కొన్ని రోజుల క్రితం వరకు మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వానికి 152 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండేది. ఇటీవల శివసేన ఎమ్మెల్యే మరణించడంతో శాసన సభ్యుల సంఖ్య 287గా ఉంది. అసెంబ్లీలో 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఉంటుంది. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి వందకు వంద శాతం రివర్స్ అయ్యింది.

 గవర్నర్ ముందుకు ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారు !

గవర్నర్ ముందుకు ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారు !

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే రాజీనామాతో మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ నాథ్ షిండే ఆయన మద్దతుదారులతో చర్చించిన తరువాత నేరుగా ముంబాయి చేరుకుని మహారాష్ట్ర గవర్నర్ ను కలవడానికి సిద్దం అవుతున్నారని సమాచారం.

ముంబాయికి ప్రత్యేక విమానం సిద్దం

ముంబాయికి ప్రత్యేక విమానం సిద్దం

మహారాష్ట్ర గవర్నర్ ను కలిసి తనకు మద్దతు ఇష్తున్న ఎమ్మెల్యేల వివరాలు, ఎందుకు తిరుగుబాటు చెయ్యాల్సి వచ్చిందో అనే విషయంపై చర్చించడానికి సిద్దం అవుతున్నారని ఆయనకు సన్నిహితుడైన ఓ నాయకుడు అంటున్నారు. ఏక్ నాథ్ షిండే ముంబాయి చేరుకోవడానికి ప్రత్యేక విమానం సిద్దం చేసుకున్నారని సమాచారం.

English summary
Rebel: Shiv Sena Rebel leader Eknath Shinde to meet MLAs today, may meet Governor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X