ఎన్కౌంటర్: తమిళనాట బాంబు దాడి, కన్నీరుమున్నీరు (పిక్చర్స్)
చెన్నై/చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా తమిళనాడులో మూడో రోజైన గురువారం నిరసనలు కొనసాగుతున్నాయి. తూత్తుకుడిలో ఉన్న ఆంధ్రాబ్యాంకుపై ఆందోళనకారులు ఉదయం బాంబు విసిరారు. ఆ సమయంలో బ్యాంకు మూసివేసి ఉండటంతో ప్రమాదం తప్పింది. ఆంధ్రా బస్సుల పైన గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం దాడి చేశారు.
తమిళనాడు నుండి ఆంద్రప్రదేశ్ వైపు వెళ్లే బస్సులను పూర్తిగా నిలిపివేశారు. అలాగే, తమిళనాడుకు వెళ్లే వందలాది బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నిలిపివేసింది. తిరువణ్ణామలై, తుత్తుకూరు, వేలూరు తదితర ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ఆంధ్రా సంస్థల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.
ఎస్పీఎస్ నెల్లూరులో వేట నిషేధించారు
తమిళనాడు, ఏపీల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉండటంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తడ తదితర ప్రాంతాల్లో వేటను నిషేధించారు. తమిళ జాలర్లు దాడి చేయవచ్చుననే ఉద్దేశ్యంతో జాలర్లు వేటకు వెళ్లడం లేదు. అధికారులు కూడా నిషేధించారు.
శేషాచలం ఎన్కౌంటర్
మంగళవారం నాడు వేకువజామున శేషాచలం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన 20మంది మృతి చెందారు.
శేషాచలం ఎన్కౌంటర్
మంగళవారం నాడు వేకువజామున శేషాచలం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన 20మంది మృతి చెందారు. కుటుంబ సభ్యుల రోదన.
శేషాచలం ఎన్కౌంటర్
మంగళవారం నాడు వేకువజామున శేషాచలం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన 20మంది మృతి చెందారు. ఓ మృతదేహం వద్ద బంధువులు.
శేషాచలం ఎన్కౌంటర్
మంగళవారం నాడు వేకువజామున శేషాచలం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన 20మంది మృతి చెందారు. పోస్టుమార్టం సమయంలో పోలీసు భద్రత.
శేషాచలం ఎన్కౌంటర్
మంగళవారం నాడు వేకువజామున శేషాచలం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన 20మంది మృతి చెందారు. పోస్టుమార్టం సమయంలో పోలీసు భద్రత.
శేషాచలం ఎన్కౌంటర్
మంగళవారం నాడు వేకువజామున శేషాచలం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన 20మంది మృతి చెందారు.
శేషాచలం ఎన్కౌంటర్
మంగళవారం నాడు వేకువజామున శేషాచలం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన 20మంది మృతి చెందారు. ఇది ఫేక్ ఎన్కౌంటర్ అంటూ కుటుంబ సభ్యుల నిరసన.