వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేఖ అమితాబ్‌ను, సచిన్ ఫ్యాన్స్‌ను: ఓట్లపై బిజెపి నేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

sachin tendulkar and rekha
భోపాల్: మధ్యప్రదేశ్ ఎన్నికలలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, నటి రేఖలను ప్రచారానికి వినియోగించుకోవాలనుకుంటున్న కాంగ్రెసు పార్టీ పైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గియ స్పందించారు. సచిన్, రేఖ వంటి వారు మాస్‌ను ఆకర్షించగలరు కానీ ఓట్లను రాల్చలేరన్నారు.

ర్యాలీలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేందుకు మాత్రమే సచిన్, రేఖల వంటి ఉపయోగపడతారని అభిప్రాయపడ్డారు. రేఖ అమితాబ్ బచ్చన్‌ను ప్రభావితం చేయవచ్చు, సచిన్ తన ఆటతో ఆకట్టుకోవచ్చు కానీ వారు కాంగ్రెసుకు ఓట్లు మాత్రం తెచ్చి పెట్టలేరన్నారు. అదే సమయంలో వారిద్దర్నీ అతను నైట్ ల్యాంప్‌తో పోల్చారు.

కాగా, అంతకుముందు కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ మాట్లాడుతూ... సచిన్, రేఖలు మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసు పార్టీ తరఫున పాల్గొంటారని చెప్పారు.

ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి.

English summary

 In a bid to hit out at Congress' choice of 'star campaigners' for upcoming assembly polls in MP, BJP's Kailash Vijayvargiya said the likes of Rekha and Sachin Tendulkar can only get masses for rallies, not votes for a political party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X