పెళ్లికి వెళ్లిన యువతిపై బంధువు, స్నేహితుల గ్యాంగ్రేప్
రాంచీ: జార్ఖండ్లోని పలమౌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 19ఏళ్ల గిరిజన యువతిపై ఆమె బంధువు, అతడి స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఖురాఖుర్డ్ గ్రామానికి చెందిన గిరిజన యువతి జైనా గ్రామంలో జరుగుతున్న బంధువుల పెళ్లికి వెళ్లింది. పెళ్లికి వచ్చిన ఆమె బంధువు అజయ్ ఓరాన్, ఆ యువతిని గ్రామంలోని పొలాల వద్దకు తీసుకెళ్లాడు.
అక్కడే అజయ్ తోపాటు అతడి స్నేహితులు వికాస్ ఓరాన్, రంజిత్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అజయ్, వికాస్లను అదుపులోకి తీసుకున్నారు.
మరో నిందితుడు రంజీత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.