రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మధ్య టారిఫ్ వార్
టెలికం మార్కెట్లోకి కొత్తగా వచ్చిన రిలయన్స్ జియో , ఎయిర్ టెల్ మధ్య మరోసారి టారిఫ్ వార్ మొదలైంది. రిలయన్స్ జియో వైపుకు తమ కస్టమర్లను తరలిపోకుండా ఉండేందుకుగాను ఆఫర్లను రహస్యంగా ఉంచాలని ఎయిర్ టెల్,
న్యూఢిల్లీ: టెలికం మార్కెట్లోకి కొత్తగా వచ్చిన రిలయన్స్ జియో , ఎయిర్ టెల్ మధ్య మరోసారి టారిఫ్ వార్ మొదలైంది. రిలయన్స్ జియో వైపుకు తమ కస్టమర్లను తరలిపోకుండా ఉండేందుకుగాను ఆఫర్లను రహస్యంగా ఉంచాలని ఎయిర్ టెల్, ఐడియా కోరుకొంటుండగా, ఫ్లాన్స్ ను కామన్ ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకురావాలని జియో డిమాండ్ చేస్తోంది.
టారిఫ్
ప్లాన్స్
ను
బహిర్గతం
చేసే
విషయంలో
టెలికం
దిగ్గజాలు
ఎయిర్
టెల్,
జియో
మధ్య
పోరు
ఉధృతమైంది.
టారిఫ్
అసెస్
మెంట్
పై
టెలికం
రెగ్యులేటరీ
మంగళవారం
నాడు
కంపెనీలకు
నఅియతగా
కాకుండా
ఒక్కో
యూజర్
సగటు
ఆదాయం,
కస్టమర్
విధేయత
వంటివాటికి
అనుగుణంగా
ఉండాలని
ట్రాయ్
సూచించింది.
మరో 30 రోజుల్లో వీటికి సంబంధించి ఓ గైడ్ లైన్స్ ను ట్రాయ్ జారీచేయనుంది. ఎప్పుడైతే కస్టమర్ తమ నెట్ వర్క్ ను వదిలివెళ్ళాలనుకొన్నప్పుడు వారిని కాపాడుకొనే బాధ్యత ప్రతి ఆపరేటర్ పై ఉంటుందని భారతీ ఎయిర్ టెల్ రెగ్యులేటరీ అధినేత ఠాకూర్ చెప్పారు.
ఇది కేవలం టెలికం ఇండస్ట్రీకి సంబంధించింది మాత్రమే కాదన్నారు. అన్ని ఇండస్ట్రీల్లో ఇదే పారదర్శకత కోసం ప్రస్తుతమున్న చర్యలు సరిపోవని, పారదర్శకత స్పెపిషికేషన్స్ స్థిరంగా లేవని జియో పేర్కొంటోంది. టెల్కోలు ఆఫర్ చేసే అన్ని ప్లాన్స్ ను కామన్ ఫ్లాట్ ఫామ్ లో ప్రచురించాలని తాము కోరుతున్నామన్నారు.
వాటినిచూసి తమకు బెస్ట్ అనిపించినవాటిని కస్టమర్లకు ఎంపికచేసుకొనే అవకాశం కల్పించాలని ఆంటోంది. ఎవరికీ కూడ ఆ ప్లాన్స్ కు మించి ఆఫర్ చేయకూడదని కూడ వాదిస్తోంది. ఒకే కేటగిరిలోని సబ్ స్క్రైబర్లకు వివిధరకాల ప్లాన్స్ ను ఆఫర్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ట్రాయ్ ఈ చర్చను నిర్వహించింది.