బంపర్ ఆఫర్: కొత్త టారిఫ్ ను ప్రకటించనున్న జియో, కస్టమర్లకు మరిన్ని సౌకర్యాలు
రిలయన్స్ జియో మరిన్ని ఉచిత ఆఫర్లను ఇవ్వడానికి సిద్దమౌతోంది. త్వరలోనే రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్లు ప్రకటించనుందని కంపెనీ వెబ్ సైట్లో ప్రకటించింది.
ముంబై: రిలయన్స్ జియో మరిన్ని ఉచిత ఆఫర్లను ఇవ్వడానికి సిద్దమౌతోంది. త్వరలోనే రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్లు ప్రకటించనుందని కంపెనీ వెబ్ సైట్లో ప్రకటించింది.
కొత్త కస్టమర్లకు అల్ట్రా అఫోర్టబుల్ డేటా టారిఫ్స్ తో పాటు , జియో ప్రైమ్ మెంబర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను ఇవ్వబోతున్నట్టుగా జియో ప్రకటించింది.
త్వరలోనే టారిఫ్ ప్యాక్స్ ను అప్ డేట్ చేస్తామంటూ రిలయన్స్ జియో ప్రకటించింది. మరిన్ని అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెట్టనున్నట్టు జియో ప్రకటించింది. ఈ మేరకు తన వెబ్ సైట్ లో జియో ప్రకటించింది.
టెలికం సర్వీస్ ప్రోవైడర్లు ఇస్తోన్న పోటీని తట్టుకొనేందుకు కొత్త సబ్ స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి కొత్త టారిఫ్ స్కీమ్ ను ప్రవేశపెట్టనున్నట్టు జియో అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
జియో ఇటీవల తీసుకువచ్చిన సమ్మర్ సర్ ఫ్రైజ్ ఆఫర్ ను ట్రాయ్ దెబ్బకొట్టడంతో ఈ ప్రభావం యూజర్లపై పడకుండా ఉండేందకు ఈ ప్లాన్లలో మార్పులు చేయబోతున్నట్టు తెలుస్తోంది.