ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరపండి: కేంద్రానికి లేఖ
ముంబై: తమ సంస్థకు చెందిన వారితో సహా ప్రముఖులు ఫోన్లను ఓ కార్పోరేట్ సంస్థ ట్యాప్ చేసిందని సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తుతున్న వార్తల పైన రిలయెన్స్ గ్రూప్ శనివారం నాడు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరింది.
ఫోన్ ట్యాపింగ్ విషయమై వీలైనంత త్వరగా సమగ్ర విచారణ జరిపించి, దోషులనుపట్టుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయడం నేరమని, అక్రమమని, తమ స్వప్రయోజనాల కోసమే కొందరు ఈ పనికి పాల్పడ్డారని, తమ సంస్థ పునర్ వ్యవస్థీకరణ జరగకముందే ఈ ట్యాపింగ్ జరగడం గమనార్హమని సంస్థ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.
ట్యాపింగ్ సంభాషణల్లో తమ పైన వెలుగు చూసిన ఆరోపణలు అవాస్తవమని రిలయన్స్ గ్రూప్ తెలిపింది. కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు సహా పలువురు ప్రముఖుల ఫోన్లను 2001-2006 మధ్య కాలంలో ట్యాప్ చేశారని వచ్చిన వార్తలు శుక్రవారం సంచలనం రేపాయి.