బరువు తగ్గి, పార్టీ బరువు పెంచు: రేణుకా చౌదరిపై వెంకయ్య వాఖ్య
Recommended Video
న్యూఢిల్లీ: రాజ్యసభ పదవీ కాలం ముగిసిన ఎంపీలకు వీడ్కోలు పలికే సమయంలో ఆసక్తికరమైన సన్నివేశాలు, సంభాషణలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెసు పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరికి ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడి నుంచి అసాధారణమైన సలహా వచ్చింది.
చాలా కీలోల ముందు నుంచి వెంకయ్య నాయుడికి తాను తెలుసునని రేణుకా చౌదరి అంటూ "అయ్యా, చాలా మంది నా బరువు గురించి ఆందోళన చెందుతున్నారు, ఈ విధిలో మీ బరువును చుట్టూ పంచాల్సి ఉంటుంది" అని అన్నారు.
రేణుకా చౌదరి వ్యాఖ్యలకు వెంకయ్య నాయుడు ప్రతిస్పందిస్తూ - "నా చిన్న సలహా ఏమిటంటే, నీ బరువు తగ్గించుకో, పార్టీ బరువును పెంచడానికి ప్రయత్నం చేయి" అని అన్నారు.అయ్యా, కాంగ్రెసు పరిస్థితి బాగానే ఉందని రేణుకా చౌదరి అన్నారు. ఈ సంభాషణకు అందరూ ఫక్కున నవ్వారు.
రాజ్యసభలో తన రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడుతూ - డిప్యూటీ చైర్ పర్సన్ పదవికి నజ్మా హెఫ్తుల్లాకు వ్యతిరేకంగా ప్రతిపక్షమంతా ఏకమైన సందర్భాన్ని చూశానని రేణుకా చౌదరి అన్నారు. అది చాలా సమస్యలను పరిష్కరించి ఉంటుందని వెంకయ్య వెంటనే అందుకున్నారు.
షా బానో నుంచి శూర్పణఖ వరకు ఈ సభలో చూసిన చరిత్ర ఉందని రేణుకా చౌదరి అన్నారు. గత నెలలో రేణుకా చౌదరి నవ్వడంపై ప్రతిస్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తనకు రామాయణంలోని ఓ పాత్ర గుర్తుకు వస్తుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన పేరు చెప్పకపోయినప్పటికీ మోడీ రేణుకా చౌదరిని శూర్పణఖతో పోల్చారనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది.